ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దండక్రమ పారాయణాన్ని పూర్తి చేసిన వేదమూర్తి దేవవ్రత్ మహేశ్ రేఖేను అభినందించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 02 DEC 2025 1:03PM by PIB Hyderabad

శుక్ల యజుర్వేదంలోని మాధ్యందిని శాఖకు చెందిన 2,000 మంత్రాల దండక్రమ పారాయణాన్ని అంతరాయం లేకుండా 50 రోజుల్లో పూర్తి చేసిన వేదమూర్తి దేవవ్రత్ మహేశ్ రేఖేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. 19 ఏళ్ల వేదమూర్తి దేవవ్రత్ మహేశ్ రేఖే సాధించిన ఈ ఘనత భవిష్యత్ తరాలకు గుర్తుండిపోతుందన్నారుపవిత్ర కాశీలో ఈ అసాధారణ కార్యక్రమం జరగటంకాశీ ఎంపీగా తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారుదేవవ్రత్ కుటుంబ సభ్యులకుఆయనకు మద్దతుగా నిలిచేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన సాధువులుయోగులుపండితులుసంస్థలకు వందనాలు తెలియజేశారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

19 ఏళ్ల యువకుడు వేదమూర్తి దేవవ్రత్ మహేశ్ రేఖే చేసిన ఈ పని రాబోయే తరాలకు గుర్తుండిపోతుంది!

శుక్ల యజుర్వేదంలోని మాధ్యందిని శాఖకు చెందిన 2,000 మంత్రాల దండక్రమ పారాయణాన్ని అంతరాయం లేకుండా 50 రోజుల్లో పూర్తి చేసినందుకు భారతీయ సంస్కృతిపై మక్కువ ఉన్న ప్రతి ఒక్కరూ గర్వపడుతున్నారుఇందులో ఎన్నో శ్లోకాలుపవిత్ర పదాలను దోషాలు లేకుండా పఠిస్తారుమన గురు పరంపర శ్రేష్టతను ఆయన మూర్తీభవింపజేశారు.

ఈ మహత్తర కార్యానికి వేదికైన పవిత్ర నగరం కాశీకి ఎంపీగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందిదేవవ్రత్ కుటుంబ సభ్యులకుఆయనకు మద్దతుగా నిలిచేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన సాధువులుయోగులుపండితులుసంస్థలకు నా ప్రణామాలు"

 

***


(रिलीज़ आईडी: 2197558) आगंतुक पटल : 2
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam