ప్రధాన మంత్రి కార్యాలయం
అంధ మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతలైన భారత అంధ మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి విందు
प्रविष्टि तिथि:
27 NOV 2025 10:03PM by PIB Hyderabad
అంధ మహిళల టీ20 ప్రపంచ కప్ను గెలుచుకున్న భారతీయ అంధ మహిళా క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆతిథ్యాన్ని ఇచ్చారు. మహిళా క్రీడాకారులతో శ్రీ మోదీ ఆప్యాయంగా మాట్లాడారు. ఆటల పోటీలో తమకు కలిగిన అనుభవాలను మహిళా క్రీడాకారులు వివరించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘అంధ మహిళల టీ20 ప్రపంచ కప్ను గెలుచుకున్న భారతీయ అంధ మహిళల క్రికెట్ జట్టుకు విందు ఇవ్వడం సంతోషదాయకం. వారి అనుభవాలు నిజంగా ఎంతో స్ఫూర్తిని ఇచ్చేవిగా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2196724)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam