ప్రధాన మంత్రి కార్యాలయం
మలేషియా ప్రధానితో సంభాషించిన ప్రధానమంత్రి
ఆసియాన్కు అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో శుభాకాంక్షలు
ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సుకు వర్చువల్గా హాజరు కానున్న పీఎం
Posted On:
23 OCT 2025 10:13AM by PIB Hyderabad
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయంగా సంభాషించారు.
ఆసియాన్కు మలేషియా అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని గౌరవ ఇబ్రహీంకు శ్రీ మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసియాన్కు సంబంధించి మలేషియా సారథ్యంలో త్వరలో జరగబోయే సదస్సులు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఆసియాన్- భారత్ శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్గా పాల్గొనేందుకు ప్రధానమంత్రి మోదీ ఆసక్తి వ్యక్తం చేశారు. అలాగే ఆసియాన్- భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
ఎక్స్లో శ్రీ మోదీ పోస్టు:
‘‘నా ప్రియ మిత్రుడు, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఆత్మీయంగా మాట్లాడాను. ఆసియాన్కు మలేషియా అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఆయనకు అభినందనలు తెలియజేశాను. అలాగే త్వరలో జరగబోయే సదస్సులు విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియజేశాను. ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సద్సులో వర్చువల్గా పాల్గొనేందుకు, ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నాను.’’
(Release ID: 2181800)
Visitor Counter : 10
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam