ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ
గాజా శాంతి ఒప్పందంలో ఈజిప్టు కీలకపాత్ర పోషించినందుకు ఆ దేశ అధ్యక్షుడు సిసీకి ప్రధాని అభినందనలు
తన పర్యటనలో భాగంగా జరిగే తొలి భారత్-ఈజిప్టు వ్యూహాత్మక చర్చ గురించి ప్రధానికి వివరించిన విదేశాంగ మంత్రి అబ్దుల్లాటీ
ద్వైపాక్షిక సహకారంలోని వివిధ రంగాల్లో సాధించిన పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన పీఎం
Posted On:
17 OCT 2025 4:23PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈజిప్టు విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ బదర్ అబ్దుల్లాటీ ఈ రోజు సమావేశమయ్యారు.
గాజా శాంతి ఒప్పందంలో ఈజిప్టు కీలక పాత్ర పోషించినందుకు.. అధ్యక్షుడు సిసీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇది ఈ ప్రాంతంలో సుదీర్ఘ శాంతికి మార్గం చూపిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
తన పర్యటనలో భాగంగా నిర్వహించే మొదటి భారత్-ఈజిప్టు వ్యూహాత్మక చర్చ గురించి ప్రధానమంత్రికి విదేశాంగ మంత్రి అబ్దుల్లాటీ వివరించారు.
వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, ప్రజా సంబంధాలతో సహా ద్వైపాక్షిక సహకారంలోని వివిధ రంగాల్లో సాధించిన పురోగతి పట్ల ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.
***
(Release ID: 2180433)
Visitor Counter : 11
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam