ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 17 SEP 2025 4:18PM by PIB Hyderabad

భారత్ మాతా కీ జైభారత్ మాతా కీ జైభారత్ మాతా కీ జై!

నర్మదా మైయా కీ జైనర్మదా మైయా కీ జైనర్మదా మైయా కీ జై!

మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్ గారుఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ గారుకేంద్ర మంత్రివర్గ సహచరులు సోదరి సావిత్రి ఠాకూర్ గారుకేంద్ర మంత్రులురాష్ట్రాల గవర్నర్లుదేశంలోని ప్రతి మూల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులువేదికపై ఉన్న ఇతర ప్రముఖులునా ప్రియమైన సోదరీ సోదరులారా!

జ్ఞానానికి అధిదేవతధార్ భోజ్‌శాలలో పూజలందుకొనే తల్లి వాగ్దేవి పాదాలకు నేను నమస్కరిస్తున్నానుఈ రోజు నైపుణ్యాలుసృజనాత్మకతల దైవం విశ్వకర్మ జన్మదిన సందర్భంలో ఆయనకూ నేను నమస్కరిస్తున్నానునైపుణ్యాలతో దేశ నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కోట్లాది మంది సోదరీ సోదరులకు విశ్వకర్మ జయంతి సందర్భంగా నేను గౌరవపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ ధార్ భూమి ఎల్లప్పుడూ శౌర్య భూమి.. స్ఫూర్తినిచ్చే భూమిమహారాజా భోజుడి శౌర్యం... బహుశా అక్కడ మీకు వినిపించకపోవచ్చు.. కనిపించకపోవచ్చుమీరు ఎంత దూరంలో ఉన్నప్పటికీ మీ హృదయంలో ఏముందో నాకు అర్థమవుతుందిఇక్కడి సాంకేతిక నిపుణులు వారికి ఏ విధంగానైనా సహాయం చేయగలిగితే.. వెంటనే సహాయం చేయండి. లేకపోయినా వారు మధ్యప్రదేశ్‌కు చెందినవారు.. చాలా క్రమశిక్షణతో ఉంటారుఅసౌకర్యం ఉన్నప్పటికీ.. మధ్యప్రదేశ్ ఎల్లప్పుడూ సహన స్వభావాన్నే కలిగి ఉందిఇప్పుడు నేను ఆ సహనాన్ని ఇక్కడ కూడా చూస్తున్నాను.

మిత్రులారా,

జాతి గౌరవాన్ని కాపాడుకోవడం కోసం దృఢంగా నిలబడాలని భోజ మహారాజు చూపిన తెగువ మనకు తెలియజేస్తుందిమానవాళికి సేవ చేయాలనే సందేశాన్ని మహర్షి దధీచి త్యాగం మనకు బోధిస్తుందివారి వారసత్వం స్ఫూర్తిగా.. నేడు మన దేశం భరతమాత భద్రతకే అత్యంత ప్రాధాన్యమిస్తోందిమన అక్కాచెల్లెళ్లుతల్లుల సిందూరాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు తుడిచేస్తే.. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల స్థావరాలను మనం నాశనం చేశాంమన సైనికులు రెప్పపాటు సమయంలోనే పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టారునిన్న ఓ పాకిస్థాన్ ఉగ్రవాది  ఏడుస్తూ తన బాధను వెళ్లగక్కడం మన దేశంతో పాటు ప్రపంచమంతా చూసింది.

మిత్రులారా,

ఇది నవ భారతంఎవరి అణ్వాయుధ బెదిరింపులకు భయపడదు… నేరుగా వారుండే చోటుకే వెళ్లి దాడి చేసి తగిన సమాధానం ఇవ్వగలదు.

మిత్రులారా,

ఈ రోజు.. సెప్టెంబర్ 17వ తేదీ మరో చరిత్రాత్మక సందర్భాన్ని సూచిస్తుందిఈ రోజునసర్దార్ పటేల్ ఉక్కు సంకల్పానికి ఒక ఉదాహరణను దేశం చూసిందిభారత సైన్యం హైదరాబాద్‌ను అనేక దురాగతాల నుంచి విముక్తి చేసిదాని హక్కులను కాపాడటం ద్వారా భారతదేశపు గర్వాన్ని పునరుద్ధరించిందిదేశం ఈ గొప్ప విజయం సాధించి చాలా దశాబ్దాలు గడిచాయిఆ విజయాన్నిసైన్యం ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలను ఎవరూ గుర్తుంచుకోలేదుకానీ మీరు నాకు అవకాశం ఇచ్చారుమన ప్రభుత్వం సెప్టెంబర్ 17ను.. సర్దార్ పటేల్ గారిని.. హైదరాబాద్ సంఘటనను చిరస్మరణీయం చేసిందిభారత ఐక్యతకు చిహ్నంగా ఉన్న ఈ రోజును మనం హైదరాబాద్ విమోచన దినోత్సవంగా పాటిస్తున్నాంఇప్పుడు హైదరాబాద్‌లో విమోచన దినోత్సవాన్ని గొప్పగా నిర్వహిస్తున్నారుహైదరాబాద్ విముక్తి దినోత్సవం మనకు స్ఫూర్తినిస్తుందిభరతమాత గౌరవంకీర్తిని మించినది ఏదీ లేదుమనం జీవిస్తే అది దేశం కోసం అయి ఉండాలి.. మన జీవితంలోని ప్రతి క్షణం దేశానికి అంకితం చేయాలి.

మిత్రులారా,

జాతి కోసం సర్వస్వం త్యాగం చేస్తామని మన స్వాతంత్య్ర సమర యోధులు ప్రతిజ్ఞ చేసి.. తమ జీవితాలను దేశానికే అంకితం చేశారువలస పాలన నుంచి విముక్తి పొందివేగంగా పురోగమిస్తూ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడమే వారి కలవారిని స్ఫూర్తిగా తీసుకొన్న 140 కోట్ల మంది భారతీయులు అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణం కోసం సంకల్పించారుఈ ప్రయాణంలో భారతీయ మహిళా శక్తియువశక్తిపేదలురైతులు నాలుగు మూలస్తంభాలుఅభివృద్ధి చెందిన భారత్ కోసం ఈ నాలుగు మూలస్తంభాలను ఈనాటి కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుంది.  పెద్ద ఎత్తున మహిళలుఅక్కాచెల్లెళ్లు ఈ కార్యక్రమం కోసం ఇక్కడకు వచ్చారునేటి కార్యక్రమంలో మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యమిచ్చాంఈ కార్యక్రమం ఇక్కడ ధార్‌లో జరుగుతున్నప్పటికీ ఇది యావత్ దేశం కోసం.. యావత్ జాతి కోసం..భారతీయ మహిళలు..ఆడబిడ్డల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమంఆరోగ్యవంతమైన మహిళ – సాధికారత గల కుటుంబం అనే గొప్ప ప్రచారాన్ని ఇక్కడ మనం ప్రారంభించుకున్నాంవాగ్దేవి ఆశీస్సులతో ఇది ప్రారంభమైంది.. ఇంతకంటే గొప్ప పని ఏముంటుంది?

మిత్రులారా,

దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ‘‘ఆది సేవా పర్వ’’ వివిధ దశల్లో తనదైన ప్రభావం చూపిస్తోందిమధ్యప్రదేశ్‌లోనూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నాంధార్‌ సహా మధ్యప్రదేశ్‌లోని మన గిరిజన తెగలకు నేరుగా వివిధ ప్రభుత్వ పథకాలను అందించే వారధిగా ఈ కార్యక్రమం పనిచేస్తుంది.

మిత్రులారా,

విశ్వకర్మ జయంతి సందర్భంగా ఇక్కడ ప్రధాన పారిశ్రామిక కార్యక్రమానికి బీజం పడిందిదేశంలోనే అతి పెద్ద సమీకృత టెక్స్‌టైల్ పార్కుకు ధార్‌లో భూమిపూజ జరిగిందిఈ పార్కు దేశ జౌళి పరిశ్రమకు కొత్త శక్తినిస్తుందిపండించిన పంటలకు సరైన ధర లభిస్తుందిఇక్కడ ధార్‌లోనే కాకుండాదేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రస్తుతం ఈ కార్యక్రమంతో అనుసంధానం కావడం నాకు సంతోషాన్నిస్తోంది.

మిత్రులారా,

ఈ పీఎమ్ మిత్ర పార్క్ఈ టెక్స్‌టైల్ పార్క్ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. మన యువతకుమహిళలకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు అందబాటులోకి వస్తాయిఈ ప్రాజెక్టులుప్రచారాల కోసం నా దేశ ప్రజలందరికీ నేను అభినందనలు తెలుపుతున్నానుమధ్యప్రదేశ్‌కు ప్రత్యేక అభినందనలు.

మిత్రులారా,

మన మాతృమూర్తులుఅక్కాచెల్లెళ్లుమన నారీ శక్తి దేశ ప్రగతికి పునాదిమనమంతా చూస్తూనే ఉంటాం.. తల్లి ఆరోగ్యంగా ఉంటేనేకుటుంబమంతా బాగుంటుంది.

మిత్రులారా,

ఆ తల్లి అనారోగ్యానికి గురైతే కుటుంబం మొత్తం అస్తవ్యస్తం అవుతుంది. ‘ఆరోగ్యవంతమైన మహిళ-సాధికారత గల కుటుంబం’ పేరిట చేస్తున్న ప్రచార కార్యక్రమం.. మాతృమూర్తులుఆడబిడ్డల ఉజ్వల భవిత కోసం అంకితమైనదిఅవగాహనా లోపంవనరుల లేమి కారణంగా ఏ మహిళా ఇబ్బంది పడకూడదనేదే మా లక్ష్యంచాలా రోగాలు శరీరంలోకి నిశ్శబ్దంగా చేరతాయి.. వాటిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మహిళలకు తీవ్ర సమస్యలు ఎదురవుతాయి.. క్రమంగా అవి ప్రాణాంతకంగా పరిణమిస్తాయిమహిళల ప్రాణాలకు ముప్పును కలిగించే ఇలాంటి వ్యాధులను తొలి దశలోనే గుర్తించడం చాలా ముఖ్యంఈ ప్రచార కార్యక్రమం ద్వారా రక్తపోటుమధుమేహంరక్తహీనతక్షయక్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను గుర్తించే పరీక్షలు చేస్తారుదేశవ్యాప్తంగా ఉన్న నా తల్లులుఆడబిడ్డలు ఎల్లప్పుడూ నాకు చాలా ఇచ్చారుమీ ఆశీర్వాదాలే నాకు గొప్ప రక్షణ కవచందేశంలోని కోట్లాది మంది తల్లులుఆడబిడ్డలు... లెక్కకు మిక్కిలిగా నన్ను ఆశీర్వదిస్తున్నారుఈ రోజు సెప్టెంబర్ 17.. విశ్వకర్మ జయంతి రోజున.. నేను నా తల్లులనుఆడబిడ్డలను ఒక విషయం అడగడానికి వచ్చానునా తల్లులుఆడబిడ్డలూ.. దయచేసి నాకు చెప్పండిమీరు నేను అడిగింది చేస్తారా లేదాదయచేసి మీ చేతులు పైకెత్తి నాకు చెప్పండిబాగుందిఅందరూ చేతులు పైకెత్తారుఎటువంటి సంకోచం లేకుండా ఈ శిబిరాలకు వెళ్లి మీరు పరీక్షలు చేయించుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నానుఒక కొడుకుగాసోదరునిగా నేను ఇదైతే అడగగలను కదానేను మీకు చెప్పాల్సిందల్లా.. ఈ ఆరోగ్య శిబిరాల్లో పరీక్షలు ఎంత ఖరీదైనవైనా మీరు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదుఫీజు ఉండదుపరీక్షలు ఉచితంఅంతే కాదు ఇక్కడ మందులు కూడా ఉచితంప్రభుత్వ ఖజానా మీ మంచి ఆరోగ్యం కంటే విలువైనది కాదుఈ ఖజానా మీ కోసం.. మీలాంటి తల్లులుఆడబిడ్డల కోసంఆయుష్మాన్ కార్డు తదుపరి చికిత్సలో మీకు రక్షణ కవచంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ రోజు నుంచి  ప్రారంభమయ్యే ఈ ప్రచారం విజయదశమిఅక్టోబర్ వరకు అంటే రెండు వారాల పాటు కొనసాగుతుందిదేశవ్యాప్తంగా ఉన్న తల్లులుఅక్కలుచెల్లెళ్ళుకుమార్తెలకు నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.  మీరు ఎప్పుడూ మీ కుటుంబం గురించే ఆందోళనపడుతూ ఉంటారుకానీమీ ఆరోగ్యం కోసం కూడా కొంత సమయం కేటాయించండిమీరు వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఈ శిబిరాలను సందర్శించాలిలక్షలాది శిబిరాలు ఏర్పాటు కాబోతున్నాయిఇప్పటికే ప్రజలు  కొన్ని శిబిరాలలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారుఈ సమాచారాన్ని మీ ప్రాంతంలోని ఇతర మహిళలకు కూడా చేరవేయండిమా మోదీజీ ధార్ కు వచ్చారనిమా కొడుకు ధార్ కు వచ్చాడనిమా సోదరుడు ధార్ కు వచ్చాడనిఆయన వచ్చి మమ్మల్ని పరీక్ష చేయించుకోమని చెప్పారని ప్రతి తల్లికిసోదరికీ చెప్పండిదయచేసి ప్రతి ఒక్కరికీ  చెప్పండిఏ తల్లి గానీఏ కుమార్తె గానీ ఆరోగ్య సేవలు అందుకోవడంలో వెనుకబడకూడదని మనం ప్రతిజ్ఞ చేయాలి.

మిత్రులారా,

తల్లులుఅక్కలుచెల్లెళ్ళుకుమార్తెల ఆరోగ్యమే మా ప్రాధాన్యంగర్భిణీ స్త్రీలుకుమార్తెలకు సరైన పోషకాహారం అందించే లక్ష్యంతో  మా ప్రభుత్వం  పని చేస్తోందిఈ రోజుమనం ఎనిమిదో జాతీయ పోషకాహార మాసోత్సవాన్ని ప్రారంభిస్తున్నాంఅభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ప్రసూతి మరణాలనుశిశు మరణాల రేటును వీలైనంత తగ్గించాలికేవలం ఇందుకోసమే  2017లో ప్రధానమంత్రి మాతృ వందన యోజనను ప్రారంభించాంఈ పథకం కింద మొదటి బిడ్డ పుట్టినప్పుడు  అయిదు వేల రూపాయలురెండోసారి ఆడపిల్ల పుట్టినప్పుడు ఆరు వేల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారుమాతృ వందన యోజన ద్వారా ఇప్పటి వరకు నాలుగున్నర కోట్ల మంది గర్భిణీ తల్లులు ప్రయోజనం పొందారుఇప్పటి వరకు 19 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారుకొంతమందికి ఈ సంఖ్య  ఏమిటో కూడా అర్థం కాకపోవచ్చునా తల్లులుఅక్కలుచెల్లెళ్ళ బ్యాంకు ఖాతాల్లో రూ.19 వేల కోట్లకు పైగా చేరిందిఈ రోజు కూడా నేను ఒక్క క్లిక్ తో 15 లక్షలమంది పైగా గర్భిణీ తల్లులకు నగదును బదిలీ చేశానుధార్ భూమి నుంచి  ఈ రోజు వారి ఖాతాల్లో 450 కోట్ల రూపాయలకు పైగా జమ అయ్యాయి.

మిత్రులారా,

ఈ రోజునేను మధ్యప్రదేశ్ నుంచి మరొక కార్యక్రమం గురించి చర్చించాలనుకుంటున్నానుమీకు తెలుసుమన గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ రక్తహీనత పెద్ద సంక్షోభంఈ వ్యాధి నుంచి  మన గిరిజన సోదరీసోదరులను రక్షించడానికి మా ప్రభుత్వం జాతీయ మిషన్ ను నిర్వహిస్తోంది. 2023లో మధ్యప్రదేశ్ లోని షాడోల్ నుంచి మేం ఈ కార్యక్రమాన్ని  ప్రారంభించాంషాడోల్ లోనే  మొదటి సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డును పంపిణీ చేశాంమళ్లీ నేడుమధ్యప్రదేశ్ లో 10 మిలియన్  (కోటిసికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డుల పంపిణీ జరిగిందిఇప్పుడే వేదికపైకి వచ్చిన కుమార్తెకు ఇచ్చిన కార్డు 10 మిలియనో కార్డునేను మధ్యప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాఈ ప్రచారం కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోట్ల మందికి పైగా పరీక్షలు నిర్వహించారుసికిల్ సెల్ స్క్రీనింగ్ మన గిరిజన సమూహాల్లోని లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

మిత్రులారా,

మేం చేస్తున్న పని రాబోయే తరాలకు గొప్ప వరం కాబోతోందిఈ రోజు మేం ఇంకా పుట్టని వారి కోసం పని చేస్తున్నాంనేటి తరం ఆరోగ్యంగా ఉంటేఅది భవిష్యత్తులో వారి పిల్లల ఆరోగ్యానికి హామీ ఇస్తుందిమన గిరిజన తల్లులుఅక్కలుచెల్లెళ్ళు  సికిల్ సెల్ అనీమియా పరీక్షలు చేయించుకోవాలని  నేను ప్రత్యేకంగా కోరుతున్నా

మిత్రులారా,

తల్లులుఅక్కలుచెల్లెళ్ళ జీవితాలను సులభతరం చేయడానికివారి కష్టాలను తగ్గించడానికీ నిరంతరం ప్రయత్నం చేస్తున్నాంస్వచ్ఛ భారత్ అభియాన్ కింద నిర్మించిన లక్షలాది మరుగుదొడ్లుఉజ్వల యోజన ద్వారా అందించిన లక్షలాది ఉచిత గ్యాస్ కనెక్షన్లుప్రతి ఇంటికి నీరు అందించడానికి చేపట్టిన జల్ జీవన్ మిషన్రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించే ఆయుష్మాన్ యోజనఇవన్నీ తల్లులుఅక్కలుచెల్లెళ్ళ జీవితాల్లో ఇబ్బందులను తగ్గించాయి.  వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచాయిఇక్కడ చాలా మంది సోదరులు ఉన్నారు.  మీ కుటుంబాలలో కూడా తల్లులుఅక్కలుచెల్లెళ్ళు,  కుమార్తెలు ఉన్నారుమీరంతా నా మాట విని మీ తల్లులుఅక్కలుచెల్లెళ్ళు,  కుమార్తెలు ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలా చూడాలని నేను  కోరుతున్నా

మిత్రులారా,

గరీబ్ కళ్యాణ్ అన్న యోజనఈ పథకం  గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా వినిపించినప్పుడువారి కళ్లలో ఆశ్చర్యం కనిపిస్తుందిఇది అంత పెద్ద సంఖ్యస్నేహితులారాకరోనా వంటి కష్టకాలంలోఈ ఉచిత రేషన్ పథకం పేద తల్లి ఇంట్లోని పొయ్యి ఆరిపోకుండా చేసిందిఈ పథకం కింద నేటికీ ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతోందిపీఎం ఆవాస్ యోజన కింద  ఇచ్చిన కోట్లాది ఇళ్లలో కూడా ఎక్కువ భాగం మహిళల పేరిటే ఉన్నాయి.

మిత్రులారా,

అక్కలుచెల్లెళ్ళుకుమార్తెలకు ఆర్థికంగా సాధికారత కల్పించడంపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందికోట్లాది మంది మన అక్కలుచెల్లెళ్ళు  ముద్రా యోజన ద్వారా రుణాలు తీసుకుని వ్యాపారాలు,  పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు.

మిత్రులారా,

గ్రామాల్లో నివసిస్తున్న మూడు కోట్లమంది తల్లులుఅక్కలుచెల్లెళ్ళను లక్షాధికారి దీదీలుగా మార్చే ప్రచారంలో మా ప్రభుత్వం నిమగ్నమై ఉందిఈ ప్రచారంలో సాధించిన విజయం కారణంగాతక్కువ సమయంలోనే దాదాపు రెండు కోట్ల మంది అక్కలుచెల్లెళ్లు లక్షాధికారి దీదీలుగా మారారని నేను చాలా గర్వంగా చెప్పగలనుమహిళలను బ్యాంక్ సఖీలు,   డ్రోన్ దీదీలుగా చేయడం ద్వారా వారిని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా మారుస్తున్నాంస్వయం సహాయ సంఘాల ద్వారా మహిళలు కొత్త విప్లవాన్ని తీసుకువస్తున్నారు.

సోదరీసోదరులారా,

గత 11 సంవత్సరాలుగాపేదల సంక్షేమంపేదల సేవవారి జీవితాలను మెరుగుపరచడం మా ప్రభుత్వ ముఖ్య ప్రాధాన్యతలుగా ఉన్నాయిదేశంలోని పేదలు పేదరికం నుంచి బయటపడి వేగంగా ముందుకు సాగినప్పుడే దేశం పురోగమిస్తుందని మేం నమ్ముతున్నాంపేదలకు సేవ చేయడం ఎప్పటికీ నష్టం కాదు.  ఒక పేదవాడికి కొద్దిపాటి మద్దతుకొద్దిపాటి సహాయం లభిస్తేఅతను తన కృషితో సముద్రాన్ని దాటే ధైర్యాన్ని కలిగి ఉంటాడుపేదల భావోద్వేగాలూభావాలూ నాకు వ్యక్తిగతంగా తెలుసునుపేదల బాధ నా సొంత బాధపేదలకు సేవ చేయడమే నా జీవిత అతిపెద్ద లక్ష్యంమా ప్రభుత్వం పేదలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం ప్రణాళికలను రూపొందిస్తోందిఅమలు కూడా చేస్తోంది.

మిత్రులారా,

ఈ పనిని స్థిరంగాఅంకితభావంతోస్వచ్ఛమైన హృదయంతో చేయడం వల్ల ఈ రోజు మా విధానాల ఫలితాలు  ప్రపంచానికి కనిపిస్తున్నాయిగత 11 సంవత్సరాల నిరంతర శ్రమకృషి వల్ల నేడు దేశంలోని 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడడం ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి గర్వం కలిగిస్తుందిమన మొత్తం సమాజంలో కూడా  కొత్త విశ్వాసం నెలకొంది

మిత్రులారా,

మా ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కేవలం పథకాలు మాత్రమే కాదు... పేద తల్లులుఅక్కలుచెల్లెళ్ళుకుమార్తెల జీవితాలను మార్చడానికి మోదీ ఇచ్చిన హామీపేదల ముఖాల్లో చిరునవ్వు తేవడానికివారి గౌరవాన్ని కాపాడటానికి ఇది నా ఆరాధనఇది నా ప్రతిజ్ఞ.

మిత్రులారా,

మహేశ్వరి వస్త్రాలకు సంబంధించిన సుదీర్ఘ సంప్రదాయం మధ్యప్రదేశ్‌లో ఉందిదేవి అహల్యాబాయి హోల్కర్ మహేశ్వరి చీరకు కొత్త కోణాన్ని ఇచ్చారుఇటీవల మనం అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతిని నిర్వహించుకున్నాంఇప్పుడు ధార్‌లోని పీఎం మిత్రా పార్క్ ద్వారా ఒక విధంగా మనం దేవి అహల్యాబాయి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాంపత్తిపట్టు వంటి ముడి పదార్థాల అందుబాటును పీఎం మిత్రా పార్క్ భారీగా మెరుగుపరుస్తుందిఇది నాణ్యతకు సంబంధించిన తనిఖీలను సులభతరం చేస్తుందిమార్కెట్లను కూడా మరింత అందుబాటులో తీసుకురానుందిస్పిన్నింగ్‌తో పాటు డిజైనింగ్ప్రాసెసింగ్‌లు ఇక్కడ జరగనున్నాయిఈ పార్క్ నుంచి వస్త్రాలు ఎగుమతి అవుతాయిఇక్కడి నుంచి వచ్చే వస్త్ర ఉత్పత్తులు పోటీ ప్రయోజనాన్ని కలిగి ఉంటాయివస్త్ర పరిశ్రమలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఒకే దగ్గర జరుగుతాయివస్త్ర పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న 5ఎఫ్ విధానంలో మొదటిది వ్యవసాయంరెండోది ఫైబర్మూడోది ఫ్యాక్టరీనాలుగోది ఫ్యాషన్వ్యవసాయం నుంచి ఫైబర్‌‌కుఫైబర్ నుంచి ఫ్యాక్టరీకిఫ్యాక్టరీ నుంచి  ఫ్యాషన్‌కుఫ్యాషన్ నుంచి విదేశాలకు జరిగే ప్రయాణం త్వరితగతినసులభంగా పూర్తవుతుంది.

మిత్రులారా,

ధార్‌లో ఉన్న ఈ పీఎం మిత్రా పార్క్‌లో 80కి పైగా యూనిట్లకు సుమారు 1,300 ఎకరాల భూమిని కేటాయించినట్లు నాకు చెప్పారుఅంటే అవసరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులుకర్మాగారాల నిర్మాణం రెండూ ఏకకాలంలో జరగనున్నాయిఈ పార్క్‌లో కొత్తగా లక్షల మంది ఉపాధి పొందనున్నారుఇది రవాణా ఖర్చులపై ఎక్కువ సానుకూల ప్రభావాన్ని చూపుతుందివస్తు రవాణా ఖర్చుతో పాటు తయారీ ఖర్చులను ఈ పార్కు తగ్గిస్తుందిమన ఉత్పత్తుల ధరను మరింత తగ్గించటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వాటి పోటీతత్వం మెరుగుపడుతుందికాబట్టి పీఎం మిత్రా పార్క్‌ విషయంలో మధ్యప్రదేశ్ ప్రజలకుముఖ్యంగా నా రైతు సోదరీసోదరులకునా యువతీయువకులను నేను అభినందనలు తెలియజేస్తున్నానుమా ప్రభుత్వం దేశంలో ఇలాంటి మరో పీఎం మిత్రా పార్క్‌లను నిర్మించనుంది.

మిత్రులారా,

ఈ రోజు దేశవ్యాప్తంగా విశ్వకర్మ పూజ చేసుకుంటున్నాంప్రధానమంత్రి విశ్వకర్మ యోజన విజయాన్ని జరుపుకోవాల్సిన సమయం కూడా ఇదివడ్రంగులుకమ్మరిస్వర్ణకారులుకుమ్మరివడ్రంగితాపీ పనివారురాగి పనివారుకంచు కళాకారులుచేతులతో అద్భుతాలు చేసే అనేక మందితో సహా దేశవ్యాప్తంగా ఉన్న నా విశ్వకర్మ సోదరీసోదరులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానుభారత్‌తో తయారీ కార్యక్రమానికి గొప్ప బలం మీరేఅది ఒక గ్రామం లేదా నగరం అయినా మీ కళమీరు తయారు చేసే ఉత్పత్తుల వలన రోజువారీ అవసరాలు తీరుతున్నాయిఇంత తక్కువ సమయంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన 30 లక్షలకు పైగా చేతివృత్తులహస్తకళల వారికి సహాయం చేసిందని తెలిసి నేను సంతోషంగా ఉన్నానుఈ పథకం ద్వారా వారు నైపుణ్య శిక్షణ పొందటంతో పాటు డిజిటల్ మార్కెటింగ్ఆధునిక సాధనాలతో అనుసంధానమయ్యారు. 6 లక్షలకు పైగా విశ్వకర్మ మిత్రులు కొత్త పరికరాలు అందుకున్నారురూ. 4 వేల కోట్లకు పైగా విలువైన రుణాలు ఇప్పటి వరకు విశ్వకర్మ సోదరీసోదరులు పొందారు

మిత్రులారా,

దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన సమాజంలోని ఒక వర్గానికి ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన ప్రయోజనం చేకూర్చిందిమన పేద విశ్వకర్మ సోదరీసోదరులకు నైపుణ్యాలు ఉన్నాయికాని క్రితం ప్రభుత్వాలు వారి నైపుణ్యాలను ప్రోత్సహించేందుకువారి జీవితాలను మెరుగుపరచడానికి ఎటువంటి ప్రణాళికను చేపట్టలేదుతమ ప్రతిభను సొంత పురోగతి కోసం ఉపయోగించుకునే మార్గాలను వారికి మేం చూపించాంఅందుకే నేను ‘వెనుకబడిన వారికే మా ప్రాధాన్యత’ అని అంటున్నాను

మిత్రులారా,

మన ధార్ పూజ్యనీయులైన కుశభావు ఠాక్రే జన్మస్థలం కూడాఆయన దేశమే ప్రథమం అనే భావనతో జీవితమంతా సమాజ సేవ కోసం అంకితం చేశారునేను ఇవాళ ఆయనకు నా వినయపూర్వక నివాళులు అర్పిస్తున్నానుదేశమే ప్రథమం అనే ఈ స్ఫూర్తి దేశాన్ని కొత్త శిఖరాలు అధిరోహించేలా చేసేందుకు తగిన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

మిత్రులారా,

ఇది పండుగ సమయంఇప్పుడు మీరు నిరంతరం స్వదేశీ మంత్రాన్ని జపించాలిస్వదేశీని జీవితంలో భాగంగా చేసుకోవాలిమీ అందరికీనా 140 కోట్ల మంది దేశ ప్రజలకు నా అభ్యర్థన.. మీరు ఏది కొన్నా అది దేశంలోనే తయారైనదై ఉండాలిమీరు ఏది కొనుగోలు చేసినా.. అది కొంతమంది భారతీయుల చెమటతో ముడిపడినదై ఉండాలిమీరు ఏది కొన్నా దానిలో మట్టి వాసన ఉండాలి… మన భారతదేశ మట్టి పరిమళం రావాలిఈ రోజు నేను వ్యాపారంలో ఉన్న సోదరీసోదరులను అభ్యర్థిస్తున్నాను.. మీరు కూడా దేశం కోసం నాకు సహాయం చేయండిదేశం కోసం నాకు మద్దతునివ్వండినేను దేశం కోసం మీ సహాయం కోరుకుంటున్నానుఎందుకంటే నేను 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలిదానికి మార్గం స్వావలంబన భారతదేశమేకాబట్టి విక్రయించేదంతా మన దేశంలోనే తయారు చేసినదై ఉండాలని నా చిన్నమధ్య తరహా వ్యాపార సోదరులందరిని కోరుతున్నానుమహాత్మా గాంధీ స్వదేశీని స్వాతంత్ర్యోద్యమ మాధ్యమంగా మలిచారుఇప్పుడు మనం స్వదేశీని అభివృద్ధి చెందిన భారతదేశ పునాదిగా మార్చాలిఇది ఎలా సాధ్యమవుతుంది?.. మన దేశంలో తయారైన ప్రతిదాని పట్ల మనం గర్వంగా ఉన్నప్పుడు ఇది జరుగుతుందిమనం కొనే పిల్లల బొమ్మలుదీపావళి విగ్రహాలుఇంటిని అలంకరించే వస్తువులు వంటి చిన్న వస్తువుల నుంచి మొబైల్ ఫోన్టీవీరిఫ్రిజిరేటర్ వంటి ఏదైనా పెద్ద వస్తువు వరకు అది మన దేశంలో తయారైనదో లేదో చూసుకోవాలినా దేశ ప్రజల చెమట పరిమళం వస్తోందా అన్నది గమనించాలిఎందుకంటే మనం స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసినప్పుడు మన డబ్బు దేశంలోనే ఉంటుందిమన డబ్బు విదేశాలకు తరలిపోదుఅదే డబ్బును మళ్లీ దేశాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చుఆ మొత్తంతో రోడ్లుగ్రామీణ పాఠశాలలు నిర్మాణమవుతాయిపేద వితంతువు తల్లులకు సహాయం అందుతుందిప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మాణమవుతాయిఅవే డబ్పులు సంక్షేమ పథకాలకు ద్వారా మీకు అందుతాయినా మధ్యతరగతి సోదరీసోదరులనా మధ్యతరగతి యువత తమ కలలను నెరవేర్చుకోవడానికి ఆ డబ్బులు అవసరందీనిని ఈ చిన్న చిన్న మంచి పనులు చేయడం ద్వారా సాధించవచ్చుమనకు అవసరమైన వస్తువులు దేశంలోనే తయారైనప్పుడు.. వాటి ద్వారా లభించే ఉపాధి కూడా మనకే వెళ్తుంది.

నవరాత్రి మొదటి రోజు అయిన సెప్టెంబర్ 22 నుంచి తగ్గించిన జీఎస్టీ రేట్లు అమలులోకి రాబోతున్నాయిమనం స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడం ద్వారా ఈ ప్రయోజనాన్ని పొందాలిమనం ఒక మంత్రాన్ని గుర్తుంచుకోవాలిఇది ప్రతి దుకాణంపై రాతపూర్వకంగా ఉండాలని నేను కోరుకుంటున్నానురాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని విన్నవిస్తున్నానుప్రతి దుకాణంపై ‘ఇది స్వదేశీ’ అనే ఒక బోర్డు ఉండాలిగర్వంగా చెప్పండి ఇది స్వదేశీమీరందరూ నాతో కలిసి అంటారామీరందరూ నాతో కలిసి అంటారానేను ‘గర్వంగా చెప్పండి’ అని అంటాను మీరు "ఇది స్వదేశీఅని అనండిగర్వంగా చెప్పండి- ‘ఇది స్వదేశీ’..గర్వంగా చెప్పండి- ‘ఇది స్వదేశీ’..గర్వంగా చెప్పండి- ‘ఇది స్వదేశీ’.. గర్వంగా చెప్పండి- ‘ఇది స్వదేశీ’.. గర్వంగా చెప్పండి- "ఇది స్వదేశీ"

మిత్రులారా,

ఈ స్వదేశీ భావనతో నేను మీకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నానుభారత్ మాతా కీజై..  భారత్ మాతా కీజై… భారత్ మాతా కీజై.. ధన్యవాదాలు.

గమనికప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఇది

 

***

 


(Release ID: 2167921)