ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జపాన్ లోని రాష్ట్రాల గవర్నర్లతో ప్రధానమంత్రి భేటీ

Posted On: 30 AUG 2025 7:34AM by PIB Hyderabad

జపాన్‌లోని స్థానిక ప్రభుత్వాల గవర్నర్లతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు16 మంది గవర్నర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

భారత్-జపాన్ సమకాలీన సంబంధాలు.. ఇరు దేశాల మధ్య పురాతన నాగరిక సంబంధాల నుంచి శక్తిని పొందుతూ నిరంతరం వృద్ధి చెందుతున్నాయని ప్రధానమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారువివిధ రంగాల్లో భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మకప్రాపంచిక భాగస్వామ్యంలో వేగాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ.. టోక్యో-ఢిల్లీ చుట్టూ కేంద్రీకృతమై ఉన్న సంబంధాలకు మించి రాష్ట్రా స్థాయిలో భాగస్వామ్యాలను ప్రోత్సాహించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు15వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రారంభించిన రాష్ట్రా భాగస్వామ్య కార్యక్రమ ఆవశ్యకతను ఆయన స్పష్టం చేశారుఇది రెండు దేశాల మధ్య వాణిజ్యంసాంకేతికతపర్యాటకంనైపుణ్యాలుభద్రతసాంస్కృతిక సంబంధాలకు ప్రోత్సాహాన్నిస్తుందని పేర్కొన్నారుగవర్నర్లుభారత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కొత్త కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని.. తయారీసాంకేతికతఆవిష్కరణమొబిలిటీతదుపరి తరం మౌలిక సదుపాయాలుఅంకురసంస్థలుఎస్ఎమ్ఈ రంగాల్లో భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని ప్రధానమంత్రి కోరారు.

జపాన్‌లోని ప్రతి రాష్ట్రం ప్రత్యేకమైన ఆర్థికసాంకేతిక బలాలు కలిగి ఉన్నవిధంగానే భారత రాష్ట్రాలకు వాటి సొంత విభిన్న సామర్థ్యాలున్నాయన్న ప్రధానమంత్రి.. భారత్ వృద్ధి గాథలో భాగస్వాములు కావాలని గవర్నర్లను ఆహ్వానించారుయువతనైపుణ్యాల బదిలీ విషయంలో చేసుకున్న ఒప్పందాలకు ఇరు దేశాలు కట్టుబడి ఉండాలని.. జపాన్ సాంకేతికతను భారతీయ ప్రతిభతో చక్కగా సమన్వయం చేయాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారుభారత్-జపాన్ మధ్య వ్యాపారంవిద్యసాంస్కృతికప్రజా సంబంధాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి దేశం నుంచి రాష్ట్రాల స్థాయి సహకారం కీలకమని గవర్నర్లు అభిప్రాయపడ్డారు.

 

***


(Release ID: 2162214) Visitor Counter : 17