ప్రధాన మంత్రి కార్యాలయం
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చిన ప్రసంగం మన దేశ సమష్టి పురోగతి, ముందున్న అవకాశాలను తెలియజేస్తోంది: ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
14 AUG 2025 8:27PM by PIB Hyderabad
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అందరిలో ఆలోచన రేకెత్తించేలా ఇచ్చిన ప్రసంగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పంచుకున్నారు. ఈ ప్రసంగం మన దేశం సమష్టి పురోగతి, ముందున్న అవకాశాలను ప్రధానంగా తెలియజేస్తోందని.. జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చిందని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:
"స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి మన దేశ సమష్టి పురోగతి, ముందున్న అవకాశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆలోచన రేకెత్తించే ప్రసంగం చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం అందించిన త్యాగాలను ఆమె మనకు గుర్తు చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు జాతి నిర్మాణంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు."
(రిలీజ్ ఐడి: 2156609)
సందర్శకుల సూచీ సంఖ్య : : 33
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
Malayalam
,
Marathi
,
हिन्दी
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Bengali
,
Manipuri
,
Assamese
,
English
,
Urdu
,
Kannada