ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్ట్వార్ లో కుంభవృష్టి, వరద ప్రభావానికి గురైన వారికి ప్రధాని సంఘీభావం,

అన్ని విధాలుగా సాధ్యమైన సాయం చేస్తామని హామీ

నాడు పోస్టు చేయడమైనది: 14 AUG 2025 4:50PM by PIB Hyderabad

జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో ఆకస్మిక కుంభవృష్టిఅనంతరం సంభవించిన వరదపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారువిపత్తు ప్రభావానికి గురైన వారికి సకాలంలో సాయం అందించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ లో కుంభవృష్టివరదల కారణంగా ప్రభావితమైన వారందరికీ నా సానుభూతి తెలియజేస్తున్నానువారి కోసం ప్రార్థిస్తున్నానుపరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాంరక్షణసహాయక కార్యకలాపాలు కొనసాగుతున్నాయిఅవసరమైన వారందరికీ అన్ని విధాలుగా సాధ్యమైన సాయం అందుతుంది.’’

 

 

***

MJPS/SR


(రిలీజ్ ఐడి: 2156459) సందర్శకుల సూచీ సంఖ్య : : 26