ప్రధాన మంత్రి కార్యాలయం
జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ
Posted On:
18 JUN 2025 2:56PM by PIB Hyderabad
కెనడాలోని కననాస్కిస్లో ఈ నెల 17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అనేక అంశాలపై నేతలు ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. మన భూమి హితాన్ని కోరుతూ భారత్, ఫ్రాన్స్ సన్నిహితంగా పనిచేస్తూనే ఉంటాయని వారు ఉద్ఘాటించారు.
ఎక్స్లో ఆయన రాసిన ఒక సందేశంలో:
‘‘అధ్యక్షుడు, నా మిత్రుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్తో సంభాషించడం ఎల్లప్పుడూ సంతోషదాయకమే. వేర్వేరు అంశాలపై మేం మా అభిప్రాయాలను పంచుకున్నాం. మన భూమి హితాన్ని కోరుకుంటూ భారత్, ఫ్రాన్స్ సన్నిహితంగా పని చేస్తూనే ఉంటాయి.@EmmanuelMacron” అని పేర్కొన్నారు.
(Release ID: 2137275)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam