ప్రధాన మంత్రి కార్యాలయం
103 అమృత్ స్టేషన్లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
Posted On:
21 MAY 2025 3:53PM by PIB Hyderabad
అమృత్ భారత్ స్టేషన్ స్కీములో భాగంగా పునరభివృద్ధి పనులు పూర్తి చేసిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. భారతీయ రైల్వేల ఆధునికీకరణలో ఒక చరిత్రాత్మక ఉన్నతిని సూచించే ఘట్టమిది.
కేంద్ర మంత్రి శ్రీ అశ్విననీ వైష్ణవ్ ‘‘ఎక్స్’’లో పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ:
‘‘రేపు- అంటే మే 22వ తేదీ... భారతీయ రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో ఓ ముఖ్య ఘట్టం చోటుచేసుకోబోయే రోజు. అమృత్ స్టేషన్లు సౌకర్యాన్నీ, సంధానాన్నీ పెంచడంతో పాటు మన వైభవోపేత సంస్కృతిని ఓ పండుగలా చేసుకోనున్నాయి’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2130389)
Read this release in:
Bengali-TR
,
Malayalam
,
Bengali
,
Odia
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada