ప్రధాన మంత్రి కార్యాలయం
కుముదిని లఖియా మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
12 APR 2025 3:39PM by PIB Hyderabad
కుముదిని లఖియా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం వ్యక్తం చేశారు. సాంస్కృతిక రంగంలో ఆమె అసాధారణ ప్రతిభతో గుర్తింపు పొందారని ఆయన ప్రశంసించారు. కథక్, భారతీయ నృత్య రీతుల పట్ల ఆమెకు గల మక్కువ.. ఆమె అద్భుతమైన రచనల్లో కనిపిస్తుందని పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్ట్లో ఆయన ఇలా పేర్కొన్నారు:
"అద్భుత సాంస్కృతిక ప్రతిభతో మంచి గుర్తింపును పొందిన కుముదిని లఖియా గారి మరణం తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. కథక్, భారతీయ నృత్య రీతుల పట్ల ఆమెకు గల మక్కువ ఆమె గత కొన్ని సంవత్సరాలుగా చేసిన అద్భుతమైన రచనల్లో కనిపిస్తుంది. నిజమైన మార్గదర్శకురాలిగా ఆమె తరతరాలుగా ఎందరో నృత్య కళాకారులను తీర్చిదిద్దారు. సాహితీ రంగానికి చేసిన కృషితో ఆమె చిరస్మరణీయులు. ఆమె కుటుంబ సభ్యులకు, శిష్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి."
(रिलीज़ आईडी: 2121323)
आगंतुक पटल : 51
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam