ప్రధాన మంత్రి కార్యాలయం
‘డిజిటల్ అభివృద్ధి పురస్కారం 2025’ను గెలిచినందుకు భారతీయ రిజర్వు బ్యాంకుకు ప్రధానమంత్రి ప్రశంసలు
Posted On:
16 MAR 2025 1:59PM by PIB Hyderabad
‘డిజిటల్ అభివృద్ధి పురస్కారం 2025’ను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గెలిచినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆర్బీఐని ప్రశంసించారు. బ్రిటన్ లోని లండన్లో సెంట్రల్ బ్యాంకింగ్ ఈ పురస్కారంతో ఆర్బీఐని సత్కరించింది. ఆర్బీఐ సంస్థాగత డెవలపర్ టీం రూపొందించగా, అమలులోకి తెచ్చిన వినూత్న డిజిటల్ కార్యక్రమాలు ‘ప్రవాహ్’, ‘సారథి’లకు సెంట్రల్ బ్యాంకింగ్ గుర్తింపు లభించింది.
ఈ విజయాన్ని ప్రధాని ప్రశంసిస్తూ, సామాజిక మాధ్యమం ఎక్స్లో పొందుపరిచిన ఒక సందేశంలో-
‘‘ప్రశంసించదగిన విజయం ఇది.. పాలనలో నవకల్పనకు, సామర్థ్యానికి అద్దంపడుతోంది.
డిజిటల్ నవకల్పనలు భారత్లో ఆర్థిక విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఫైనాన్షియల్ ఇకోసిస్టమ్)ను బలపరుస్తూ, ఈ క్రమంలో ఎంతో మందికి సాధికారతను కల్పిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.
***
MJPS/ST
(Release ID: 2111751)
Visitor Counter : 11
Read this release in:
Odia
,
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil