ప్రధాన మంత్రి కార్యాలయం
ఆహార భద్రత, పేదరిక నిర్మూలన లక్ష్యాలకు భారత్ కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి
Posted On:
18 NOV 2024 11:52PM by PIB Hyderabad
ఆహార భద్రత, పేదరిక నిర్మూలన లక్ష్యాలకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు స్పష్టం చేశారు. విజయపథంలో మరింత ముందుకు సాగుతూ, వనరుల సమర్ధ వినియోగం, ప్రపంచ ఐక్యత ద్వారా లభించే శక్తులను భారత్ సార్వత్రిక అభివృద్ధి కోసం వినియోగిస్తుందని చెప్పారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పై గీతా గోపీనాథ్ రాసిన పోస్టుకు ప్రధాని స్పందన తెలియజేస్తూ: “ఆహార భద్రత, పేదరిక నిర్మూలనలకు భారత్ కట్టుబడి ఉంది. ఇప్పటి వరకూ సాధించిన విజయాల పునాదిగా, వనరుల సక్రమ వినియోగం, సామూహిక బలం ఊతంగా అందరి బంగారు భవిష్యత్తు కోసం పరిశ్రమిస్తాం” అన్నారు.
***
MJPS/SR
(Release ID: 2074590)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam