ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

పురుషుల క్లబ్ త్రో పోటీలో రజత పతకాన్ని గెలిచిన ప్రణవ్ సూర్మా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అబినందనలు

Posted On: 05 SEP 2024 8:05AM by PIB Hyderabad

పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 (దుడ్డుకర్ర ను విసిరే) పోటీలో వెండి పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు శ్రీ ప్రణవ్ సూర్మా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు.  శ్రీ ప్రణవ్ సూర్మా పట్టుదలను,  దృఢ దీక్షను  ప్రధాని ప్రశంసించారు.

శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘పారాలింపిక్స్ 2024 (#Paralympics2024) లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 పోటీలో రజత పతకాన్ని గెలిచినందుకు ప్రణవ్ సూర్మా కు అభినందనలు.  ఆయన సాధించిన విజయం ఎంతో మంది యువజనులకు ప్రేరణనిస్తుంది.  ఆయనలోని దృఢ దీక్ష, పట్టుదల  ప్రశంసనీయమైనవి.

చీర్ ఫర్ భారత్ (#Cheer4Bharat)’’



(Release ID: 2052092) Visitor Counter : 39