ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రజల చెంతకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్ ధన్ యోజన సాఫల్య సందేశం

Posted On: 28 AUG 2024 1:30PM by PIB Hyderabad

 అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకుపోయేందుకు ఉద్దేశించిన  ‘‘జన్ ధన్ యోజన’’ కార్యక్రమం ఈ రోజుతో పది వసంతాలు  పూర్తి చేసుకొన్న సందర్భంగా, ఈ పథకం విజయాన్ని చాటి చెబుతూ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే పది సంఖ్యలు, వాటి గురించి వివరణ ఉన్న ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.


ప్రధాన మంత్రి ‘ఎక్స్’ మాధ్యమంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘జన్ ధన్ యోజన సాధించిన విజయం ఏ స్థాయిలో ఉన్నదీ సృజనాత్మకంగా వెల్లడించిన ఈ సందేశాన్ని గమనించండి. #10YearsOfJanDhan’’

 

 

***

MJPS/RT



(Release ID: 2049371) Visitor Counter : 27