హోం మంత్రిత్వ శాఖ

‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీలోని తన నివాస భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన #HarGharTiranga (హర్ ఘర్ తిరంగా) అభియాన్ లో భాగంగా యావత్తు భారతదేశం త్రివర్ణమయంగా మారుతోంది.

నేను ఈ రోజు న్యూ ఢిల్లీ లోని నా నివాసంలో తిరంగాను ఎగురవేశాను; దేశ విముక్తి కై తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన వీరులను స్మరించుకొన్నాను.

కోట్లాది దేశ ప్రజల ఏకత్వానికి, విధేయతకు, గౌరవానికి ప్రతీక గా తిరంగా సదా రెపరెపలాడుతూనే ఉంటుంది

Posted On: 14 AUG 2024 11:27AM by PIB Hyderabad

‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ లో భాగంగా మువ్వన్నెల జెండాను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు (బుధవారం) న్యూ ఢిల్లీలో తన నివాస భవనంపై ఎగురవేశారు.

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి ‘ఎక్స్’ లో -

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆరంభించిన #HarGharTiranga (హర్ ఘర్ తిరంగా) అభియాన్ లో భాగంగా భారతదేశమంతా మువ్వన్నెల జెండాల రెపరెపలతో కళకళలాడుతోంది.  ఈ రోజున న్యూఢిల్లీలోని నా నివాసంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాను; దేశ స్వాతంత్య్రం కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన వీరులను స్మరించుకొన్నాను.  కోట్ల కొద్దీ దేశవాసుల ఏకత్వానికి, విధేయతకు, గౌరవానికి ఒక సంకేతంగా మువ్వన్నెల జెండా సదా రెపరెపలాడుతూనే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 2045167) Visitor Counter : 29