ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నమో భారత్ రైలు వీడియో తీసిన యూట్యూబ‌ర్‌కు ప్రధాని అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2024 9:20PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ నమో భారత్ రైలు తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌‘ప్రెస్ వే దాటుతున్న వీడియో తీసిన యూట్యూబర్ శ్రీ మోహిత్ కుమార్‌ను అభినందించారు. కుమార్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విశేషాలను వివరించే వీడియోలు తీస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన నమో భారత్ రైలు వీడియో తీయడంపై ప్రధాని స్పందిస్తూ:

‘‘ఈ వీడియో అద్భుతం... మనమంతా సమష్టిగా నిర్మిస్తున్న నవ భారతంపై మీరు చక్కని దృక్పథంతో అందర్నీ ఆకట్టుకునేలా దీన్ని చిత్రించారు’’ అని ప్రశంసించారు.


(రిలీజ్ ఐడి: 2014306) సందర్శకుల సూచీ సంఖ్య : : 132