ప్రధాన మంత్రి కార్యాలయం
మారిశస్ లోని అగాలెగా దీవి లో క్రొత్త ఎయర్స్ట్రిప్ తోపాటు, ఒక జెట్టీ ని ఫిబ్రవరి 29 వ తేదీనాడు సంయుక్తం గా ప్రారంభించనున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మారిశస్ ప్రధాన మంత్రి శ్రీ ప్రవింద్ జగన్నాథ్ లు
అగాలెగా దీవి లో ఆరు సాముదాయిక అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం జరుగుతుంది
ఈ ప్రాజెక్టులు మారిశస్ లోని ముఖ్య క్షేత్రం తో అగాలెగా దీవి కి కనెక్టివిటీ ని బలపరచడం తో పాటు సముద్ర సంబంధి భద్రత ను పటిష్ట పరుస్తాయి
Posted On:
27 FEB 2024 6:44PM by PIB Hyderabad
మారిశస్ లోని అగాలెగా దీవి లో ఆరు సాముదాయిక అభివృద్ధి ప్రాజెక్టుల తో పాటు క్రొత్త ఎయర్స్ట్రిప్, ఇంకా సెయింట్ జేమ్స్ జెట్టీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్ లు 2024 ఫిబ్రవరి 29 వ తేదీ నాడు మధ్యాహ్నం పూట ఒంటి గంట వేళ లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా సంయుక్తం గా ప్రారంభించనున్నారు.
ఈ ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమం భారతదేశాని కి మరియు మారిశస్ కు మధ్య బలమైనటువంటి మరియు దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి అభివృద్ధి ప్రధాన భాగస్వామ్యానికి ఒక నిదర్శనగా ఉంది అని చెప్పాలి. ఈ ప్రాజెక్టులు మారిశస్ ముఖ్య క్షేత్రం మరియు అగాలెగా దీవి కి మధ్య మెరుగైన సంధానం తాలూకు ఆవశ్యకత ను పూర్తి చేయడమే కాకుండా సముద్ర సంబంధి భద్రత ను బలోపేతం చేస్తాయి; అలాగే సామాజిక, ఆర్థిక అభివృద్ధి కి ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వనున్నాయి.
ఇద్దరు నేతలు ఇటీవలే అంటే 2024 ఫిబ్రవరి 12వ తేదీ న మారిశస్ లో యుపిఐ మరియు రూపే కార్డుల సేవల ను ప్రారంభించిన తరువాత ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం జరుగుతుండడం తో ఈ కార్యక్రమం ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నది.
***
(Release ID: 2009959)
Visitor Counter : 123
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam