ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

భారత వాతావరణ విజ్ఞాన విభాగం ఏర్పడి 150 సంవత్సరాలుఅయినట్లు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 15 JAN 2024 6:02PM by PIB Hyderabad

మన దేశ ప్రజల కు భారత వాతావరణ విజ్ఞాన విభాగం (ఇండియా మీటియరాలజికల్ డిపార్ట్ మెంట్ - ఇఎమ్ డి) అందిస్తున్నటువంటి అసామాన్యమైన సేవ పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసల ను కురిపించారు. ఈ రోజు తో ఈ యొక్క విభాగం జాతి కి తాను అందిస్తున్నటువంటి సేవల లో 150 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకొన్నది.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ఈ రోజు న మనం భారత వాతావరణ విజ్ఞాన విభాగం మన దేశ ప్రజల కు అందిస్తున్నటువంటి అసాధారణమైన సేవ తాలూకు 150 సంవత్సరాలు పూర్తి అయిన ఘట్టాన్ని గమనించుకొంటున్నాం. వాతావరణ స్థితి గతుల ను ముందు గా తెలియజేయడం లో మార్గదర్శి గా ఉండడం మొదలుకొని శీతోష్ణ స్థితి సంబంధి పరిశోధన ను ముందుకు తీసుకు పోవడం వరకు ఐఎమ్ డి ప్రజల ప్రాణాల ను కాపాడడం లో పనిముట్టు గా ఉంది; అంతేకాక పరిసరాల ను గురించి న మన అవగాహన ను వృద్ధిచెందింప చేస్తున్నది కూడాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS



(Release ID: 1996555) Visitor Counter : 217