ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియన్ పారా గేమ్స్ లో ఆర్చరీలో స్వర్ణ పతకం గెలుచుకున్న శీతల్ దేవికి ప్రధానమంత్రి అభినందనలు

నాడు పోస్టు చేయడమైనది: 27 OCT 2023 5:45PM by PIB Hyderabad

హాంగ్ ఝూ ఆసియన్  పారా గేమ్స్  లో ఆర్చరీలో మహిళల ఇండివిడ్యువల్ కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్ లో స్వర్ణ పతకం గెలుచుకున్న శీతల్  దేవికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఆమె దృఢ సంకల్పం, అంకిత భావానికి నిదర్శనం ఈ విజయం అన్నారు.

ఎక్స్  లో ప్రధానమంత్రి ఈ మేరకు ఒక సందేశం పోస్ట్  చేశారు.

‘‘ఆసియన్  పారా గేమ్స్  లో ఆర్చరీలో మహిళల ఇండివిడ్యువల్ కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్ లో శీతల్  దేవి అద్భుత  ప్రతిభ ప్రదర్శించి స్వర్ణ పతకం గెలవడం గర్వకారణం. ఆమె దృఢ సంకల్పం, అంకిత భావానికి నిదర్శనం ఈ విజయం’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 1972457) సందర్శకుల సూచీ సంఖ్య : : 132