ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల లాంగ్ జంప్-టి 64లో స్వర్ణ పతకం సాధించిన ధర్మరాజ్ సొలైరాజ్ కు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 27 OCT 2023 6:48PM by PIB Hyderabad

హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్  పారా గేమ్స్  లో పురుషుల లాంగ్  జంప్-టి 64లో స్వర్ణ పతకం సాధించిన ధర్మరాజ్  సొలైరాజ్  ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఎక్స్  లో ప్రధానమంత్రి ఈ మేరకు ఒక సందేశం పోస్ట్  చేశారు.

‘‘ఆసియన్  పారా గేమ్స్  లో పురుషుల లాంగ్  జంప్-టి 64 ఈవెంట్ లో బంగారు దూకుతో స్వర్ణ పతకం సాధించినందుకు ధర్మరాజ్  సొలైరాజ్  కు అభినందనలు. అతని విజయంతో భారత్ ఉత్సాహంలో ఉంది. అతను చరిత్ర నెలకొల్పడమే కాకుండా జాతిలో స్ఫూర్తిని నింపాడు’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1972446) Visitor Counter : 96