ప్రధాన మంత్రి కార్యాలయం

ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో బాడ్ మింటన్ మహిళల సింగిల్స్ఎస్ యు5 పోటీ లో మనీషా రామదాసు గారు కాంస్య పతకాన్ని సాధించినందుకు సంతోషాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 26 OCT 2023 2:38PM by PIB Hyderabad

చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో బాడ్ మింటన్ మహిళల సింగిల్స్ ఎస్ యు5 పోటీ లో మనీషా రామదాసు గారు కంచు పతకాన్ని గెలిచిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందనల ను తెలిపారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ఏశియాన్ పారా గేమ్స్ బాడ్ మింటన్ మహిళల సింగిల్స్ ఎస్ యు5 విభాగం లో కాంస్య పతకాన్ని చేజిక్కించుకొన్నందుకు మనీషా రామదాసు గారి కి ఇవే హృదయపూర్వక మైనటువంటి అభినందన లు.

క్రీడల పట్ల అంకిత భావం మొదలుకొని గెలుపును సాధించడం వరకు ఆమె సాగించినటువంటి యాత్ర భారతదేశం లో ప్రతి ఒక్కరి కీ ప్రేరణ గా నిలుస్తున్నది.’’ అని పేర్కొన్నారు.

 

 



(Release ID: 1971780) Visitor Counter : 92