ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడోత్సవాలు 2022లో భారత పురుషుల 4x400 రిలే స్వర్ణ పతకం సాధించడాన్ని వేడుక చేసుకున్న ప్రధానమంత్రి

Posted On: 04 OCT 2023 7:40PM by PIB Hyderabad

హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియా క్రీడోత్సవాలు 2022లో భారత పురుషుల భారత పురుషుల టీమ్ 4x400 రిలే ఈవెంట్  లో స్వర్ణ  పతకం సాధించినందుకు టీమ్ సభ్యులైన మహమ్మద్ అనాస్ యాహ్యా, అమోజ్ జాకబ్, మహమ్మద్ అజ్మల్, రాజేశ్  రమేశ్  లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్  లో ఒక పోస్ట్  చేస్తూ

‘‘ఆసియా క్రీడోత్సవాల్లో భారత పురుషుల 4x400 రిలే టీమ్ ఏమి అద్భుత ప్రదర్శన చూపించింది. మహమ్మద్ అనాస్ యాహ్యా, అమోజ్ జాకబ్, మహమ్మద్ అజ్మల్, రాజేశ్  రమేశ్ స్వర్ణ పతకం తిరిగి భారతదేశానికి తీసుకువచ్చినందుకు గర్వపడుతున్నాను. వారికి నా అభినందనలు’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1964739) Visitor Counter : 86