ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడోత్సవాల్లో రజత పతకం సాధించిన భారత మహిళల 4x400 రిలే టీమ్ కు ప్రధానమంత్రి

Posted On: 04 OCT 2023 7:24PM by PIB Hyderabad

ఆసియా  క్రీడోత్సవాల్లో భారత మహిళల 4x400 రిలే టీమ్ రజత పతకం  సాధించడం గర్వకారణం అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ అద్భుత ప్రదర్శనకు విద్య రామ్  రాజ్, ఐశ్వర్య కైలాస్ మిశ్రా, ప్రాచి, సుభా వేంకటేశన్  లకు శ్రీ మోదీ అభినందనలు తెలియచేశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్  లో ఒక పోస్ట్  చేస్తూ

‘‘ఆసియా  క్రీడోత్సవాల్లో భారత మహిళల 4x400 రిలే టీమ్ రజత పతకం గెలిచినందుకు గర్వపడుతున్నాను.

అద్భుత ప్రదర్శన చూపిన  విద్య రామ్ రాజ్, ఐశ్వర్య కైలాస్ మిశ్రా, ప్రాచి, శుభా వేంకటేశ్  లకు అభినందనలు. వారి దృఢ సంకల్పం, అంకిత భావం, టీమ్ వర్క్  జాతి యావత్తుకు ఎంతో ఆనందం కలిగించింది’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1964737) Visitor Counter : 76