ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల పురుషుల బాక్సింగ్ +92 కిలోల విభాగంలో కాంస్య పతక విజేత నరేందర్ బెర్వాల్కు ప్రధానమంత్రి అభినందన

Posted On: 03 OCT 2023 10:04PM by PIB Hyderabad

   సియా క్రీడల పురుషుల బాక్సింగ్ +92 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన నరేందర్ బెర్వాల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల బాక్సింగ్ +92 కిలోల విభాగంలో కాంస్య పతక విజేత నరేందర్ బెర్వాల్‌కు హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో ఆయన మరిన్ని మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. భారతదేశం గర్వించేలా అతని ప్రతిభ సదా ప్రకాశించాలి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS



(Release ID: 1963939) Visitor Counter : 65