ప్రధాన మంత్రి కార్యాలయం
గడచిన తొమ్మిదిసంవత్సరాల లో సౌర సామర్థ్యం 54 రెట్లు వృద్ధి చెందిన నేపథ్యం లో మిశన్ నెట్ జీరో లో పురోగతి ని ప్రశంసించినప్రధాన మంత్రి
Posted On:
29 AUG 2023 8:41PM by PIB Hyderabad
మిశన్ నెట్ జీరో మార్గం లో వేసినటువంటి పెద్ద పెద్ద అంగల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
గడచిన తొమ్మిది సంవత్సరాల లో సౌర సామర్థ్యం 54 ఇంతలు పెరిగినట్లు రైల్ వేస్ సామాజిక మాధ్యం ‘X’ లో తెలిపింది. 2014 వ సంవత్సరం మార్చి నెల నాటికి ఏర్పాటైన సౌర విద్యుత్తు సామర్థ్యం 3.68 మెగా వాట్ స్ గా ఉండగా, 2014-23 మధ్య కాలం లో 200.31 మెగా వాట్ ల సామర్థ్యాన్ని నెలకొల్పడం జరిగిందని వివరించింది.
ప్రధాన మంత్రి దీనికి సమాధానాన్ని ఇస్తూ -
‘‘హరిత భవిష్యత్తు విషయం లో మన నిబద్ధత దిశ లో ప్రశంసానీయమైన పురోగతి ని ఇది చాటుతున్నది. కేవలం తొమ్మిది సంవత్సరాల లో, మనం #MissionNetZero కర్బన ఉద్గారాల బాట లో మునుముందుకు పయనిస్తూ మన యొక్క సామర్థ్యం లో చెప్పుకోదగిన వృద్ధి ని సాధించాం. రండి, మనం భారతదేశం కోసం ఒక ఉజ్జ్వలమైన టువంటి మరియు మన్నిక కలిగివుండేటటువంటి భవిష్యత్తు కు పూచీ పడుతూ ఈ యాత్ర ను కొనసాగించుదాం.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1953540)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam