ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పాపువా న్యూ గినీ లోని పోర్ట్ మోరెస్బీ కి చేరుకున్న ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 21 MAY 2023 8:06PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం మే నెల 21వ తేదీ నాటి సాయంత్రం పూట పోర్ట్ మోరెస్ బీ కి చేరుకొన్నారు. పాపువా న్యూ గినీ ప్రధాని శ్రీ జేమ్స్ మారాపే విమానాశ్రయం వద్ద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ఆత్మీయ గా ఆహ్వానం పలికారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి 19 శతఘ్నుల వందనం తో పాటు గౌరవ వందనాన్ని సమర్పించడం జరిగింది.

 

పాపువా న్యూ గినీ ని భారతదేశాని కి చెందిన ప్రధాన మంత్రి ఒకరు సందర్శించడం ఇదే ప్రథమం. ఈ యాత్ర పసిఫిక్ ఐలండ్ కంట్రీస్ తో భారతదేశాని కి గల సన్నిహిత మైత్రి ని చాటి చెబుతున్నది.

 

***

 


(రిలీజ్ ఐడి: 1926410) సందర్శకుల సూచీ సంఖ్య : : 237