ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షల లో ఉత్తీర్ణులైనవారందరికీ అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 12 MAY 2023 2:42PM by PIB Hyderabad

సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షల లో ఉత్తీర్ణులు అయినటువంటి #ExamWorriors అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో,

 

‘‘సిబిఎస్ఇ పన్నెండో తరగతి పరీక్షల లో ఉత్తీర్ణులు అయిన #ExamWarriors ను అందరిని నేను అభినందిస్తున్నాను. ఈ యువజనుల కఠోర శ్రమ ను మరియు దృఢసంకల్పాన్ని చూసి నేను గర్వపడుతున్నాను. ఈ యువజనుల సాఫల్యం లో మహత్తరమైనటువంటి పాత్ర ను పోషించినందుకు వారి తల్లితండ్రుల కు మరియు గురువుల కు నేను అభినందనల ను తెలియ జేస్తున్నాను.’’

 

‘‘12వ తరగతి పరీక్షల ను మరింత బాగా వ్రాయాల్సింది అని భావిస్తున్నటువంటి తెలివితేటలు గల యువజనుల కు నేను చెప్పదలచుకున్నది ఏమిటి అంటే- రాబోయే కాలాల్లో మీరు సాధించాల్సింది ఎంతో ఉంది. పరీక్షల తాలూకు ఒక సెట్ మీరేమిటో అనేది చెప్పజాలదు. మీకు ఆసక్తి ఉన్నటువంటి రంగాల లో మీ యొక్క ప్రతిభ ను సద్వినియోగం చేసుకోండి. మీరు తప్పక పెద్ద సాఫల్యాన్ని దక్కించుకొంటారు- అనేదే.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/SH


(Release ID: 1923753)