ప్రధాన మంత్రి కార్యాలయం
పద్మశీ గ్రహీత శ్రీ ప్రేమ్జిత్ బారియా బహూకరించిన కళాఖండాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
Posted On:
16 APR 2023 10:09AM by PIB Hyderabad
పద్మశీ పురస్కార గ్రహీత శ్రీ ప్రేమ్జిత్ బారియా తనకు పంపిన చారిత్రక దియ్యూ చిత్రాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఇటీవలే పద్మశ్రీ పురస్కారం అందుకున్న శ్రీ ప్రేమ్జిత్ బారియా నుంచి కొద్ది రోజుల కిందట నేను ఈ అద్భుత కళాఖండాలను అందుకున్నాను. ఇదిదో చూడండి... అద్భుత చారిత్రక నగరం దియ్యూ సహా అనేక చిత్రాలు వీటిలో ఉన్నాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
“ఈ చిత్రాలను వీక్షించండి... వీటిని చూస్తే- భవిష్యత్తులో దియ్యూ నగర సందర్శనాసక్తి మీలో చిగురించడం తథ్యమని నా విశ్వాసం” అని ప్రధాని పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1917149)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam