ప్రధాన మంత్రి కార్యాలయం

మొజాంబిక్‌లో ‘భారత్‌ తయారీ’ రైలులో విదేశాంగ శాఖ మంత్రి ప్రయాణం


‘భారత్‌లో తయారీ కార్యక్రమం’ ప్రగతిపై ప్రధానమంత్రి ప్రశంస

Posted On: 16 APR 2023 9:55AM by PIB Hyderabad

   ‘భారత్‌లో తయారీ కార్యక్రమం' ప్రగతి పథంలో సాగుతుండటంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కాగా, మొజాంబిక్‌ పర్యటనలో భాగంగా భారత విదేశాంగశాఖ మంత్రి శ్రీ ఎస్‌.జైశంకర్‌ మాపుటో నుంచి మచావా నగరం దాకా ఆ దేశ రవాణా శాఖ మంత్రితో కలసి భారత్‌ తయారీ రైలులో ప్రయాణించారు. ఈ విషయాన్ని ఆయన ఒక ట్వీట్‌ ద్వారా పంచుకోగా, ప్రధానమంత్రి దానిపై స్పందించారు.

ఈ మేరకు పంపిన సందేశంలో:

“ఇది భారతీయులందరికీ ఆనందం కలిగించే విషయం! అంతర్జాతీయంగా భారత్‌లో తయారీ కార్యక్రమం @makeinindia ముందంజ ఇలాగే కొనసాగుతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS



(Release ID: 1917145) Visitor Counter : 149