ప్రధాన మంత్రి కార్యాలయం

ముద్ర యోజన 8 ఏళ్లు పూర్తిచేసుకోవడంపై ప్రధానమంత్రి అభినందన

Posted On: 08 APR 2023 11:59AM by PIB Hyderabad

   ముద్ర యోజన 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఈ అంశంమీద ‘మైగవ్‌ఇండియా’ (MyGovIndia) ట్వీట్‌ల పరంపరపై స్పందిస్తూ పంపిన సందేశంలో:

“నిధులందని వారికి నిధులు సమకూర్చడంలో #PMMudraYojana కీలక పాత్ర పోషించింది. తద్వారా అనేకమంది భారతీయులకు గౌరవప్రదంగా, సౌభాగ్యంతో జీవించే సౌలభ్యం కల్పించింది. ఇవాళ #PMMudraYojana 8వ వార్షికోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈ పథకంతో లబ్ధిపొంది, సంపద సృష్టికర్తలుగా ఆవిర్భవించిన ఔత్సాహిక వ్యవస్థాపకులందరికీ నా అభివందనం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అలాగే “ముద్ర యోజన వేగం గురించి ఈ వీడియో చక్కగా వివరిస్తుంది” అని తెలిపారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖ ట్వీట్‌పై స్పందిస్తూ- “ఎంతో ప్రశంసనీయం! మనవాళ్ల నిరంతర కృషికి ఇదొక నివాళి” అని పేర్కొన్నారు.

In response to a tweet by the Finance Ministry, the Prime Minister said;

 

"Commendable! A tribute to the hardwork of our people."

***

DS/SH



(Release ID: 1914894) Visitor Counter : 165