ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆస్ట్రో నైట్  స్కై టూరిజమ్ నుప్రోత్సహించడం కోసం ఉద్దేశించిన ప్రయాస ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 MAR 2023 4:11PM by PIB Hyderabad

టెలిస్కోప్ ద్వారా ఆకాశాన్ని రాత్రి పూట వీక్షించడానికి సంబంధించిన మరపురానటువంటి అనుభూతి ని దక్కించుకోవడం కోసం మిరామార్ బీచ్ కు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్న పూర్వ రంగం లో, ఆస్ట్రో నైట్ స్కై టూరిజమ్ ను ప్రోత్సహించడం కోసం గోవా సైన్స్ సెంటర్ & ప్లానిటేరియమ్ చేపట్టిన ప్రయాస ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

నేశనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ -

‘‘ఈ తరహా ప్రయాస లు జోరు అందుకోవడం చూసి సంతోషం కలుగుతున్నది. కొన్నేళ్ళ క్రిందట ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం తాలూకు ఒక ఎపిసోడ్ లో ఖగోళ శాస్త్రం లో భారతదేశాని కి గల సంపన్న వారసత్వాన్ని గురించి నేను కూడా మాట్లాడాను’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

DS/TS


(రిలీజ్ ఐడి: 1911922) సందర్శకుల సూచీ సంఖ్య : : 186