ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పి.ఎల్.ఐ. పథకం ఉక్కు రంగానికి స్పష్టమైన శక్తినిచ్చింది, మన యువకులు, పారిశ్రామికవేత్తలకు అవకాశాలను సృష్టిస్తుంది: ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 MAR 2023 8:12PM by PIB Hyderabad

ఆత్మ నిర్భరత సాధించేందుకు ఉక్కు చాలా కీలకమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పి.ఎల్‌.ఐ. పథకం రంగాన్ని స్పష్టంగా శక్తివంతం చేసిందని, మన యువకులు, పారిశ్రామికవేత్తలకు అవకాశాలను సృష్టిస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు.

 

పి.ఎల్.ఐ. పథకం కింద ప్రత్యేకమైన ఉక్కు కోసం 27 కంపెనీలతో 57 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడం కోసం ఉక్కు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఎం.ఓ.యు. సంతకాల కార్యక్రమం గురించి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా చేసిన ట్వీట్‌ను పంచుకుంటూ, ప్రధానమంత్రి ట్వీట్ చేస్తూ, ఆత్మనిర్భరతను సాధించడానికి ఉక్కు చాలా ముఖ్యమైనది. పి.ఎల్.. పథకం స్పష్టంగా రంగాన్ని ఉత్తేజపరిచింది. ఇది మన యువకులు, వ్యవస్థాపకులకు అవకాశాలను సృష్టిస్తుంది." అని, పేర్కొన్నారు.

 

***

DS/TS

 


(రిలీజ్ ఐడి: 1908287) సందర్శకుల సూచీ సంఖ్య : : 231