ప్రధాన మంత్రి కార్యాలయం

‘ని-క్షయ మిత్ర’గా నమోదై తన పొదుపు సొమ్ముతో టీబీ రోగుల సంరక్షణ బాధ్యత చేపట్టిన 13 ఏళ్ల మీనాక్షి క్షత్రియకు ప్రధానమంత్రి ప్రశంసలు

Posted On: 04 FEB 2023 10:47AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక మీనాక్షి క్షత్రియపై ప్రశంసలు గుప్పించారు. ఈ మేరకు ఆమె ‘ని-క్షయ’ మిత్రగా నమోదు చేసుకుని, తన పొదుపు సొమ్ముతో క్షయ రోగుల సంరక్షణ బాధ్యత స్వీకరించడం ద్వారా ఆమె చూపిన విశిష్ట సేవాభావాన్ని ప్రధాని అభినందించారు.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ట్వీట్‌కు ప్రతిస్పందనగా ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో:

   “ఇది అందరూ గుర్తించాల్సిన ఔదార్యం... క్షయరహిత భారతం లక్ష్య సాధన కృషికి ఆమె సేవాభావం ఎంతగానో ఉత్తేజమిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1896506) Visitor Counter : 147