ప్రధాన మంత్రి కార్యాలయం

‘జిఇఎం’ వేదికపైఉత్పత్తులు ప్రదర్శిస్తున్నవారికి ప్రధాని ప్రశంస


ఈ వేదికపై లభ్యమయ్యే వస్తువుల స్థూల విలువ రూ.లక్ష కోట్లకు పైమాటే!

Posted On: 29 NOV 2022 9:47PM by PIB Hyderabad

జీఇఎం వేదికపై తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్న విక్రేతలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. కాగా, 2022-2023 ఆర్థిక సంవత్సరానికిగాను 2022 నవంబరు 29నాటికి ఈ వేదికపై లభ్యమయ్యే వస్తువుల స్థూల విలువ రూ.లక్ష కోట్లకుపైగా నమోదైంది.

ఈ మేరకు కేంద్ర మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ చేసిన ట్వీట్‌పై ప్రధాని స్పందిస్తూ-

“ఇదెంతో అద్భుతమైన సమాచారం! @GeM_India భారత వ్యవస్థాపక ఉత్సాహాన్ని ప్రదర్శించడంతోపాటు పారదర్శకతను పెంపొందించడంలో కొత్తపుంతలు తొక్కింది. ఈ వేదికపై తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్న వారందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ బాటను అనుసరించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను” అని పేర్కొన్నారు.

 



(Release ID: 1879923) Visitor Counter : 142