ప్రధాన మంత్రి కార్యాలయం
ఐసీసీ టి20 మ్యాచ్లో విజయంపై భారత క్రికెట్ జట్టుకు ప్రధాని అభినందన
అకుంఠిత దీక్షతో ఆడిన విరాట్ కోహ్లీకి ప్రశంసలు
Posted On:
23 OCT 2022 11:00PM by PIB Hyderabad
ఐసీసీ టి20 ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“భారత జట్టు పట్టుదలతో పోరాడి విజయం సాధించింది! ఇవాళ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించడంపై అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్న @imVkohliకి ప్రత్యేక ప్రశంసలు. అకుంఠిత దీక్షతో తిరుగులేని రీతిలో జట్టును విజయం వైపు నడిపించడం అద్భుతం. ఇకపై ఆడబోయే మ్యాచ్లలోనూ విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.
(Release ID: 1870715)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam