ప్రధాన మంత్రి కార్యాలయం
చెన్నైలో జరిగిన 44వ చెస్ ఒలింపియాడ్ లో కాంస్య పతకం గెలుచుకున్న ఇండియా బి టీమ్ (పురుషులు), ఇండియా ఎ టీమ్ (మహిళలు) రెండింటినీ అభినందించిన ప్రధానమంత్రి
44వ చెస్ ఒలింపియాడ్ కు ఆతిథ్యం ఇచ్చినందుకు తమిళనాడు ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధానమంత్రి ప్రశంసలు
Posted On:
10 AUG 2022 8:12PM by PIB Hyderabad
చెన్నైలో జరిగిన 44వ చెస్ ఒలింపియాడ్ లో కాంస్య పతకం సాధించిన ఇండియా బి టీమ్ (పురుషులు), ఇండియా ఎ టీమ్ (మహిళలు) రెండింటికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియచేశారు. 44వ చెస్ ఒలింపియాడ్ కు ఆతిథ్యం ఇచ్చినందుకు, ప్రపంచం యావత్తును ఆహ్వానించినందుకు, అసాధారణమైన సంస్కృతి, ఆతిథ్య సేవలు ప్రదర్శించినందుకు తమిళనాడు ప్రజలను, ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు.
ప్రధానమంత్రి ఈ దిగువ ట్వీట్ లు చేశారు :
“చెన్నైలో ఇప్పుడే ముగిసిన 44వ చెస్ ఒలింపియాడ్లో భారత టీమ్ లు ప్రోత్సాహకరమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాయి. కాంస్య పతకం సాధించినందుకు ఇండియా బి టీమ్ (పురుషులు), ఇండియా ఎ టీమ్ (మహిళలు) రెండింటినీ నేను అభినందిస్తున్నాను. దేశంలో చెస్ భవిష్యత్తుకు ఇది దోహదపడుతుంది”.
“దేశానికి పతకాలు అందించిన గుకేశ్.డి, నిహాల్ శరీన్, అర్జున్ ఎరిగైసి, ప్రజ్ఞానంద, వైశాలి, తానియా సచ్ దేవ్, దివ్య దేశ్ ముఖ్ లకు నా అభినందనలు. వారంతా అసాధారణ క్రీడాకారులు. అద్భుతమైన ప్రతిభా, సామర్థ్యాలు ప్రదర్శించారు. వారికి భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను”.
“తమిళనాడు ప్రజలు, ప్రభుత్వం 44వ చెస్ ఒలింపియాడ్ కు అద్భుత అతిథులు. ప్రపంచం యావత్తును ఆహ్వానించినందుకు, అద్భుత సంస్కృతి, ఆతిథ్యం ప్రదర్శించినందుకు వారిని ప్రశంసిస్తున్నాను” అన్నారు.
*****
DS/TS
(Release ID: 1850745)
Visitor Counter : 165
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam