ప్రధాన మంత్రి కార్యాలయం

బాడ్ మింటన్ డబల్స్ లో తృష జాలి మరియు గాయత్రి గోపీచంద్ గారు లు కంచుపతకాన్ని గెలుచుకోవడం గర్వం గా ఉందన్న ప్రధాన మంత్రి 

Posted On: 08 AUG 2022 8:10AM by PIB Hyderabad

బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో భాగం గా జరిగిన బాడ్ మింటన్ డబల్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు తృష జాలి గారి కి మరియు గాయత్రి గోపీచంద్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘బాడ్ మింటన్ డబుల్స్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు తృష జాలి గారు మరియు గాయత్రి గోపిచంద్ గారు లను చూసి మన కు గర్వం గా ఉంది. తృష కామన్ వెల్థ్ గేమ్స్ కు బయలుదేరి వెళ్ళే కంటే ముందు, గాయత్రి తో తనకు ఉన్న స్నేహాన్ని గురించి నాతో చెప్పారు. అయితే, ఒకవేళ తాను ఒక పతకాన్ని సాధించడం అంటూ జరిగితే గనక ఆ గెలుపు ను ఏ విధం గా వేడుక గా నిర్వహించుకొనేదీ తాను ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదని ఆమె అన్నారు. ఇప్పుడు ఆమె దీనికి సంబంధించిన ప్రణాళిక ను సిద్ధం చేసుకొనే ఉండి ఉండవచ్చని నేను ఆశిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/ST

 

 



(Release ID: 1849900) Visitor Counter : 93