ప్రధాన మంత్రి కార్యాలయం
300 మీటర్ల పురుషుల స్టీపల్చేజ్ ఈవెంట్లో రజతపతకం సాధించిన అవినాష్ సబ్లేను అభినందించిన ప్రధానమంత్రి
Posted On:
06 AUG 2022 6:20PM by PIB Hyderabad
2022 బర్మింగ్ హామ్ కామన్వెల్త్ క్రీడలలో పురుషుల 300 మీటర్ల స్టీపల్ చేజ్ క్రీడలో రజత పతకం సాధించిన అవినాష్ సబ్లేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. సబ్లేతో ఇటీవల తాను మాట్లాడిన విషయాన్ని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. అవినాశ్కు ఆర్మీతో గల అనుబంధం గురించి కూడా అతను ఈ సందర్భంగా ప్రధానమంత్రికి తెలిపారు. అవినాశ్కు అభినందనలు తెలియజేస్తూ ట్విట్టర్ ద్వారా ప్రధానమంత్రి, అవినాశ్ సబ్లే అద్భుత యువకుడు. 300 మీటర్ల పురుషుల స్టీపల్ చేజ్ ఈవెంట్లో అతను రజత పతకం సాధించడం ఆనందంగా ఉంది. ఇటీవల అతనితో మాట్లాడాను. ఈ సందర్భంగా అతను తనకు సైన్యంతో గల అనుబంధం గురించి , జీవితంలో ఎన్నో అడ్డంకులను ఎలా అధిగమించినదీ చెప్పాడు. అతని జీవితం ఎంతో ప్రేరణాత్మకం అని ప్రధానమంత్రి తెలిపారు.
(Release ID: 1849582)
Visitor Counter : 115
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam