ప్రధాన మంత్రి కార్యాలయం
రేస్ వాకింగ్ ఛాంపియన్ ప్రియాంక గోస్వామి ప్రతిష్ఠాత్మక రజత పతకం సాధించినందుకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
06 AUG 2022 6:18PM by PIB Hyderabad
బర్మింగ్హామ్ లో జరుగుతున్న 2022 కామన్వెల్త్ క్రీడలలో ప్రతిష్ఠాత్మక రజత పతకం సాధించిన రేస్ వాకింగ్ ఛాంపియన్ ప్రియాంక గోస్వామికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ట్వీట్ చేస్తూ,
"మన జాతీయ స్థాయి రేస్ వాకింగ్ ఛాంపియన్ ప్రియాంక గోస్వామి ప్రతిష్ఠాత్మక రజత పతకం సాధించినందుకు అభినందనలు. ఈ పతకాన్ని సాధించడం ద్వారా ఆమె ఇండియాలోని ఎంతోమంది యువత ఈ క్రీడను చేపట్టేందుకు ప్రేరణనిస్తున్నారు. రాగల రోజులలో ఆమె మరిన్ని ఉన్నత విజయ శిఖరాలు అధిరోహించగలదని ఆశిస్తున్నాను". అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1849581)
Visitor Counter : 94
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam