ప్రధాన మంత్రి కార్యాలయం

రేస్ వాకింగ్ ఛాంపియ‌న్ ప్రియాంక గోస్వామి ప్ర‌తిష్ఠాత్మ‌క ర‌జ‌త ప‌త‌కం సాధించినందుకు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 06 AUG 2022 6:18PM by PIB Hyderabad

బ‌ర్మింగ్‌హామ్ లో జ‌రుగుతున్న‌ 2022 కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల‌లో ప్ర‌తిష్ఠాత్మ‌క ర‌జ‌త ప‌త‌కం సాధించిన రేస్ వాకింగ్ ఛాంపియ‌న్ ప్రియాంక గోస్వామికి ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.
ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ట్వీట్ చేస్తూ,
  "మ‌న జాతీయ స్థాయి రేస్ వాకింగ్ ఛాంపియ‌న్ ప్రియాంక గోస్వామి  ప్ర‌తిష్ఠాత్మ‌క ర‌జ‌త ప‌త‌కం సాధించినందుకు అభినంద‌న‌లు. ఈ ప‌త‌కాన్ని సాధించ‌డం ద్వారా ఆమె ఇండియాలోని ఎంతోమంది యువ‌త ఈ క్రీడ‌ను చేప‌ట్టేందుకు ప్రేర‌ణ‌నిస్తున్నారు. రాగ‌ల రోజుల‌లో ఆమె మ‌రిన్ని ఉన్న‌త విజ‌య‌ శిఖ‌రాలు అధిరోహించగ‌ల‌ద‌ని ఆశిస్తున్నాను".  అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.

 



(Release ID: 1849581) Visitor Counter : 94