ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో టేబుల్ టెన్నిస్ లో బంగారు పతకాన్నిగెలుచుకొన్నందుకు శ్రీయుతులు  జి. సత్యన్ కు, హర్ మీత్ దేసాయికి, శరత్ కమల్ కు మరియు సానిల్ శెట్టి కి అభినందన లు తెలిపినప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 AUG 2022 9:17PM by PIB Hyderabad

బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో టేబుల్ టెన్నిస్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీయుతులు జి. సత్యన్, హర్ మీత్ దేసాయి, శరత్ కమల్ మరియు సానిల్ శెట్టి లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘టేబుల్ టెన్నిస్ లో ఓ గొప్ప వార్త. శ్రీయుతులు జి. సత్యన్, హర్ మీత్ దేసాయీ, శరత్ కమల్ మరియు సనీలి శెట్టి లతో కూడిన హుషారైన జట్టు కు కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను ఇవే అభినందన లు. ఈ జట్టు నైపుణ్యం లో గాని లేదా దృఢ సంకల్పం లో గాని ఉన్నత ప్రమాణాల ను ఖాయం చేసింది. వారి భావి ప్రయత్నాలు సైతం సఫలం కావాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 

 


(రిలీజ్ ఐడి: 1847762) సందర్శకుల సూచీ సంఖ్య : : 134