ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రముఖవ్యంగ్యచిత్రకారుడు శ్రీ నారాయణ్ దేబ్ నాథ్ జీ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తంచేసిన ప్రధాన మంత్రి

Posted On: 18 JAN 2022 2:32PM by PIB Hyderabad

ప్రముఖ వ్యంగ్యచిత్రకారుడు శ్రీ నారాయణ్ దేబ్ నాథ్ జీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ నారాయణ్ దేబ్ నాథ్ జీ తన రచన లు, వ్యంగ్యచిత్రాలు, బొమ్మ ల మాధ్యమం ద్వారా ఎంతో మంది జీవితాల లోకి వెలుగుల ను తీసుకువచ్చారు. ఆయన రచన లు ఆయన బౌద్ధిక శక్తి ని దర్శింపచేస్తాయి. ఆయన సృష్టించిన పాత్ర లు ఎల్లప్పటికీ లోకప్రియం గా ఉండిపోతాయి. ఆయన మరణం నన్ను బాధించింది. ఆయన కుటుంబానికి, ఆయన ను అభిమానించే వారికి ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH



(Release ID: 1790734) Visitor Counter : 159