ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధాన మంత్రి

Posted On: 19 NOV 2021 6:38PM by PIB Hyderabad

 

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని శ్రీ మోదీ హామీ ఇచ్చారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

 

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ysjagan గారి తో మాట్లాడడం జరిగింది. కేంద్రం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చాను. ఈ సమయంలో అందరూ సురక్షితంగా, భద్రంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.



(Release ID: 1773388) Visitor Counter : 128