ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ కాంస్యం విజేత ఆకాష్‌కుమార్‌కు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 06 NOV 2021 8:34PM by PIB Hyderabad

   ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన భారత బాక్సర్‌ ఆకాష్ కుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా సందేశంలో;

“శభాష్‌ ఆకాష్! ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిష్టాత్మక పతకం కైవసం చేసుకున్నందుకు నా అభినందనలు…

   ఈ విజయం మన యువ బాక్సర్లు మరింత రాణించడంలో స్ఫూర్తినిస్తుంది… భవిష్యత్తులోనూ నీవు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.

 



(Release ID: 1769856) Visitor Counter : 140