ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారాలింపిక్స్ క్రీడలలో పురుషుల హై జంప్ టి-47 లో రజత పతకం సాధించిన నిషాద్ కుమార్‌ ను అభినందించిన - ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 29 AUG 2021 5:44PM by PIB Hyderabad

టోక్యో లో పారాలింపిక్స్‌ పురుషుల హై-జంప్ టి-47 లో రజత పతకం సాధించిన నిషాద్ కుమార్‌ ను, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ,  "టోక్యో నుండి చాలా సంతోషకరమైన వార్త వచ్చింది!  పురుషుల హై-జంప్ టి-47 లో నిషాద్ కుమార్ రజత పతకం సాధించినందుకు చాలా ఆనందించాను.  అతను అత్యుత్తమ నైపుణ్యాలు, పట్టుదల కలిగిన అద్భుతమైన క్రీడాకారుడు. అతనికి నా అభినందనలు. #Paralympics" అని పేర్కొన్నారు. 

 

 

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1750222) आगंतुक पटल : 224
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam