ప్రధాన మంత్రి కార్యాలయం

వెహికల్స్క్రాపేజి పాలిసి ఈ రోజు న ప్రారంభం కావడం భారతదేశం అభివృద్ధి యాత్ర లో ఒక ప్రముఖమైనటువంటిమైలురాయి గా ఉంది: ప్రధాన మంత్రి 

Posted On: 13 AUG 2021 11:35AM by PIB Hyderabad

ఈ రోజు న ప్రారంభమైన వెహికల్ స్క్రాపేజ్ పాలిసి భారతదేశం అభివృద్ధి ప్రస్థానం లో ఒక ప్రముఖమైనటువంటి మైలురాయి గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

‘‘ఈరోజున ప్రారంభమయిన వెహికల్ స్క్రాపేజ్ పాలసీ భారతదేశ ప్రస్థానం లో ఒక ప్రముఖమైనటువంటి మైలురాయి గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వెహికల్ స్క్రాపేజ్ కు సంబంధించిన మౌలిక సదుపాయాల ను ఏర్పాటు చేయడం కోసం గుజరాత్ లో జరుగుతున్న ఇన్వెస్టర్ సమిట్ అనేక అవకాశాల కు తలుపుల ను తెరుస్తున్నది. ఈ కార్యక్రమం లో చేరండి అంటూ మన యువతీ యువకులను, స్టార్ట్-అప్ లను నేను అభ్యర్థిస్తున్నాను.

పనికిరానటువంటి, కాలుష్యాని కి కారణం అయ్యేటటువంటి వాహనాల ను పర్యావరణానికి మేలు చేసే పద్ధతి లో దశల వారీగా తొలగించడం లో వెహికల్ స్క్రాపేజ్ తోడ్పడనుంది. ఒక చైతన్యవంతమైనటువంటి #circulareconomy ని ఏర్పరచి, పర్యావరణం పరం గా చూసినప్పుడు బాధ్యతయుతం గా నడుచుకొంటూనే దీనిలో భాగస్తులు అయిన వర్గాలు అన్నింటి కి విలువ ను జత చేయాలి అన్నదే మన ధ్యేయం’’ అని ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1745359) Visitor Counter : 210