ప్రధాన మంత్రి కార్యాలయం

బాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ నందు నాటేకర్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 JUL 2021 11:50AM by PIB Hyderabad

బాడ్ మింటన్ క్రీడాకారుడు శ్రీ నందు నాటేకర్ మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

భారతదేశం క్రీడల చరిత్ర లో శ్రీ నందు నాటేకర్ కు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఆయన ఒక అసాధారణమైనటువంటి బాడ్ మింటన్ ఆటగాడు, అంతే కాకుండా ఆయన ఒక గొప్ప మార్గదర్శకుడు కూడాను. ఆయన సఫలత వర్ధమాన క్రీడాకారుల కు ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది. ఆయన మృతి తో దు:ఖితుడి ని అయ్యాను. ఈ విషాద భరిత ఘడియ లో ఆయన కుటుంబాని కి, ఆయన మిత్రుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓం శాంతి. ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1739937) సందర్శకుల సూచీ సంఖ్య : : 199