ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ సుందర్లాల్ బహుగుణ మృతిపై ప్రధానమంత్రి సంతాపం
Posted On:
21 MAY 2021 1:56PM by PIB Hyderabad
ప్రముఖ పర్యావరణవేత్త శ్రీ సుందర్లాల్ బహుగుణ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో- ‘‘శ్రీ సుందర్లాల్ బహుగుణ శివైక్యం చెందడం జాతికి తీరని నష్టం. శతాబ్దాలుగా మనం ప్రకృతితో సామరస్యపూర్వక సహజీవనం చేయడంలోని నైతికతను ఆయన ఆచరణాత్మకంగా చూపారు. ఆయన నిరాడంబరత్వం, కరుణా స్ఫూర్తిని మనం ఎన్నటికీ మరువలేం. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను... ఓం శాంతి’’ అని ఆయన పేర్కొన్నారు.
***
(Release ID: 1720572)
Visitor Counter : 138
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam