ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ సుందర్‌లాల్ బహుగుణ మృతిపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 21 MAY 2021 1:56PM by PIB Hyderabad

   ప్రముఖ పర్యావరణవేత్త శ్రీ సుందర్‌లాల్ బహుగుణ కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో- ‘‘శ్రీ సుందర్‌లాల్ బహుగుణ శివైక్యం చెందడం జాతికి తీరని నష్టం. శతాబ్దాలుగా మనం ప్రకృతితో సామరస్యపూర్వక  సహజీవనం చేయడంలోని నైతికతను ఆయన ఆచరణాత్మకంగా చూపారు. ఆయన నిరాడంబరత్వం, కరుణా స్ఫూర్తిని మనం ఎన్నటికీ మరువలేం. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను... ఓం శాంతి’’ అని ఆయన పేర్కొన్నారు.

 

***



(Release ID: 1720572) Visitor Counter : 126