ప్రధాన మంత్రి కార్యాలయం

బాపూజీ-బంగబంధు డిజిటల్ ప్రదర్శనను ప్రారంభించిన ప్రధానమంత్రి

Posted On: 26 MAR 2021 9:35PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని గౌరవనీయులైన షేక్ హసీనాతో కలసి ‘బాపూజీ-బంగబంధు’ డిజిటల్ ప్రదర్శనను ప్రారంభించారు. దక్షిణాసియా ప్రాంత దేశాలకు చెందిన ‘బాపూజీ, బంగబంధు’ ఇద్దరూ సకల మానవాళికీ ఆదర్శప్రాయులైన నాయకులు కాగా... వారి ఆలోచనా విధానం, సందేశాలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంటాయి.

   ఈ ప్రదర్శన సంరక్షక అధికారి శ్రీ బిరాద్ యాజ్ఞిక్‌ దేశాధినేతలిద్దరికీ ఇందులోని విశేషాలను విశదీకరించగా, షేక్ రెహనా కూడా వారితో కలసి ప్రదర్శనను సందర్శించారు.

***



(Release ID: 1708071) Visitor Counter : 116