ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులు 1.7 లక్షలలోపు;

మొత్తం పాజిటివ్ కేసులలో వీరు1.58% కంటే తక్కువ

వరుసగా రెండు రోజులుగా 5,70,000 కంటే ఎక్కువ టీకాలు

ఇప్పటిదాకా కోవిడ్ టీకాలు తీసుకున్నవారు 35 లక్షల పైమాటే

Posted On: 30 JAN 2021 10:52AM by PIB Hyderabad

భారత్ లో కోవిడ్ చికిత్స తీసుకుంటున్నవారి సంఖ్య ఈ రోజుకు 1.7 లక్షల లోపుకు ( 1,69,824) చేరింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులలో వీరి వాటా 1.58% మాత్రమే 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FKSH.jpg

9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వారపు పాజిటివ్ శాతం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది.  కేరళలో అత్యధికంగా  12.20% ఉండగా, చత్తీస్ గఢ్ లో అది 7.30% గా నమోదైంది.

 

 

27 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాలలో వారపు పాజిటివ్ శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003CVN6.jpg

కోలుకుంటున్నవారి మొత్తం సంఖ్య వేగంగా పెరుగుతూ ఉండగా భారత్ లో కోలుకున్నవారి శాతం 96.98% కి చేరింది.  ఇది ప్రపంచ దేశాల్లో నమోదైన అత్యధిక శాతాల్లో ఒకటి. ప్పటివరకు కోటికి పైగా ( కచ్చితంగా చెప్పాలంటే 1,04,09,160 మంది) కోలుకున్నారు. గత 24 గంటలలో   14,808 మంది కోవిడ్ బాధితులు కోలుకొన్నారు. టీకాల కార్యక్రమం ఉద్ధృతంగా సాగుతూ ఉండగా గత రెండు రోజులుగా రోజుకు 5.7 లక్షలకంటే ఎక్కువమంది టీకాలు తీసుకున్నారు.  

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0044709.jpg

దేశ వ్యాప్త కోవిడ్-19 టీకాల కార్యక్రమంలో భాగంగా 2021 జనవరి 30 ఉదయం 8 గంటలవరకు మొత్తం 35 లక్షల 27 మంది టీకాలు తీసుకున్నారు.

 

 

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0057Y9D.jpg

గత 24 గంటలలో 5,71,974 మందికి  10,809 శిబిరాలలో టీకాలు వేశారు. ఇప్పటివరకు  

63,687 శిబిరాలు నిర్వహించారు.

 

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం

టీకాల లబ్ధిదారులు

1

అండమాన్, నికోబార్ దీవులు

2,727

2

ఆంధ్రప్రదేశ్

1,79,038

3

అరుణాచల్ ప్రదేశ్

9,265

4

ఆస్సాం

36,932

5

బీహార్

1,10,396

6

చండీగఢ్

2,977

7

చత్తీస్ గఢ్

62,529

8

దాద్రా, నాగర్ హవేలి

607

9

డామన్, డయ్యూ

333

10

ఢిల్లీ

48,008

11

గోవా

3,391

12

గుజరాత్

2,21,675

13

హర్యానా

1,23,935

14

హిమాచల్ ప్రదేశ్

22,918

15

జమ్మూ, కశ్మీర్

26,634

16

జార్ఖండ్

33,119

17

కర్నాటక

3,07,891

18

కేరళ

1,35,835

19

లద్దాఖ్

989

20

లక్షదీవులు

746

21

మధ్యప్రదేశ్

2,46,181

22

మహారాష్ట్ర

2,61,320

23

మణిపూర్

3,399

24

మేఘాలయ

4,200

25

మిజోరం

8,497

26

నాగాలాండ్

3,973

27

ఒడిశా

2,05,200

28

పుదుచ్చేరి

2,299

29

పంజాబ్

54,988

30

రాజస్థాన్

3,24,973

31

సిక్కిం

2,020

32

తమిళనాడు

97,126

33

తెలంగాణ

1,66,606

34

త్రిపుర

27,617

35

ఉత్తరప్రదేశ్

4,63,793

36

ఉత్తరాఖండ్

25,818

37

పశ్చిమ బెంగాల్

2,21,994

38

ఇతరములు

50,078

                         మొత్తం

35,00,027

 

కొత్తగా కోలుకున్నవారిలో 85.10% మంది 10 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యారు. కేరళలో అత్యధికంగా ఒక్క రోజులో 6,398 మంది కోలుకోగా, మహారాష్ట్రలో  2,613 మంది, కర్నాటకలో 607 మంది కోలుకున్నారు.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006LZO2.jpg

 

గత 24 గంటలలో 13,083 కొత్త కోవిడ్ కేసులు వచ్చాయి, అందులో  81.95%  మంది ఆరు రాష్టాలకు చెందినవారు. కేరళలో అత్యధికంగా ఒక రోజులో  6,268 కేసులు రాగా, ఆ తరువాత స్థానాల్లో మహారాష్ట ( 2771), తమిళనాడు (509) ఉన్నాయి. 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007MIAZ.jpg 

 

గడిచిన 24 గంటలలో 137 మంది కోవిడ్ బాధితులు చనిపోయారు. ఏడు రాష్ట్రాల్లొనే 83.94% మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర్లో అత్యధికంగా 56 మంది మరణించగా, కేరళలో 22 మంది, పంజాబ్ లో 11 మంది చనిపోయారు.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0081MW4.jpg

**** 



(Release ID: 1693640) Visitor Counter : 152